మోదీ ప్రభుత్వం వాటిని అన్లాక్ చేసింది
గత కొద్ది రోజులుగా మోదీ ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తాజగా బుధవారం మరో మారు....
దిల్లీ: కొద్ది రోజులుగా మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తాజగా బుధవారం మరో తన మాటలకు పదునుపెట్టారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులతో సహా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు మోదీ ప్రభుత్వం తాళాలు తెరిచిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ‘‘కరోనా వైరస్ మాత్రమే పెరగడం లేదు.. అనే పేరుతో ఒక గ్రాఫ్ను షేర్ చేస్తూ.. మోదీ ప్రభుత్వం కరోనా మహమ్మారితో పాటు పెట్రోల్, డీజిల్ ధరలకూ తాళాలు తెరిచింది’’ అని హిందీలో ట్వీట్ చేశారు.
లాక్డౌన్ నిబంధనలు సడలించిన నాటి నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రతిపక్ష కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది. భారత్ కరోనా ప్రారంభదశలో ఉన్నప్పుడే లాక్డౌన్ అమలు చేసిందని, అయితే వైరస్ తీవ్రత తగ్గుతున్న సమయంలో లాక్డౌన్ ఎత్తేయడంతో కరోనా తీవ్రత పెరుగుతోందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గడచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 15,968 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,183కి చేరింది. నిన్న ఒక్క రోజే 465 మరణాలు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో 2,58,685 మంది కోలుకోగా, వైరస్ కారణంగా 14,476 మంది మృత్యువాతపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ