ఉండవల్లిలో తెదేపా నేతల అరెస్టు..ఉద్రిక్తత
ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా సర్కారు ప్రజావేదిక కూల్చి ఏడాది కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని తెదేపా నేతలు నిర్ణయించారు
అమరావతి: ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా సర్కారు ప్రజావేదిక కూల్చి ఏడాది కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని తెదేపా నేతలు నిర్ణయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. ప్రజావేదిక వద్దకు వచ్చే నాలుగు రహదారుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. తెదేపా నేతల వాహనాలు మినహా మిగతా వాటిని అనుమతించారు.
ఉండవల్లి కరకట్ట వద్దకు చేరుకున్న తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, టి.శ్రావణ్కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు అశోక్బాబు, రాజేంద్రప్రసాద్, బచ్చుల అర్జునుడు తదితరులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తెదేపా నేతలను అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు చేసిన తెదేపా నేతలను పోలీసు వాహనంలో మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ