ఉండవల్లిలో తెదేపా నేతల అరెస్టు..ఉద్రిక్తత

ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా సర్కారు ప్రజావేదిక కూల్చి ఏడాది కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని తెదేపా నేతలు నిర్ణయించారు

Updated : 25 Jun 2020 17:11 IST

అమరావతి: ఉండవల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైకాపా సర్కారు ప్రజావేదిక కూల్చి ఏడాది కావడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని తెదేపా నేతలు నిర్ణయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించారు. ప్రజావేదిక వద్దకు వచ్చే నాలుగు రహదారుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. తెదేపా నేతల వాహనాలు మినహా మిగతా వాటిని అనుమతించారు.

ఉండవల్లి కరకట్ట వద్దకు చేరుకున్న తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, టి.శ్రావణ్‌కుమార్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, రాజేంద్రప్రసాద్‌, బచ్చుల అర్జునుడు తదితరులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, తెదేపా నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. తెదేపా నేతలను అప్రజాస్వామికంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. అరెస్టు చేసిన తెదేపా నేతలను పోలీసు వాహనంలో మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని