దూకుడు పెంచిన రఘురామకృష్ణరాజు

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం వైకాపాలో కాక పుట్టిస్తోంది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనకు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత....

Published : 26 Jun 2020 13:12 IST

అమరావతి‌: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం వైకాపాలో కాక పుట్టిస్తోంది. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనకు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. దీంతో రఘురామకృష్ణరాజు మరింత దూకుడు పెంచారు. తనకు షోకాజ్‌ నోటీసు ఇచ్చే అధికారం విజయసాయిరెడ్డికి అసలు ఉందా? లేదా? అని ప్రశ్నించారు. వైకాపాలో క్రమశిక్షణ కమిటీ ఉందా? అని నిలదీశారు. విజయసాయిరెడ్డి నుంచి తనకు అందిన లేఖపై పలు సందేహాలు లేవనెత్తుతూ వాటిని తీర్చాలని కోరుతూ రఘురామకృష్ణరాజు గురువారం ఆయనకే లేఖ పంపారు. అందులో ‘మీ లేఖకు ఇది బదులు మాత్రమే.. సంజాయిషీ కాదు’ అని స్పష్టం చేశారు.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఇవాళ దిల్లీ వెళ్లనున్నారు. ఎంపీ దిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈరోజు మధ్యాహ్నం ఎన్నికల కమిషన్‌, హోంశాఖ అధికారులను కలిసే అవకాశముందని సమాచారం. నియోజకవర్గ పర్యటన సందర్భంగా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ను కోరారు. ఎంపీ విజ్ఞప్తిని స్పీకర్‌ అదే రోజు హోంశాఖ కార్యదర్శికి పంపించారు. రఘురామకృష్ణమరాజు ఇవాళ స్పీకర్‌ను కూడా కలిసే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని