‘ప్రజలకు ఏం కావాలో భాజపాకు తెలుసు’
అభివృద్ధి పనుల వల్లే రెండోసారి మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
అమరావతి: అభివృద్ధి పనుల వల్లే రెండోసారి మరింత మెజారిటీతో అధికారంలోకి వచ్చామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. భాజపా మూడో వర్చువల్ ర్యాలీలో ఆమె మాట్లాడారు. అంత్యోదయ అనే మాటకు మోదీ ప్రభుత్వం అసలైన అర్థం చెబుతోందన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుకు ఏడాదికి రూ. ఆరు వేలు ఇస్తున్నామని చెప్పారు. పది కోట్ల మంది రైతులకు రూ.72 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్లో అభివృద్ధి పనులు వేగవంతమైనట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఏం కావాలో, ఏం చేయాలో భాజపాకు తెలుసనని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
‘‘ఏపీ ప్రజలకు మోదీ అన్ని విధాలుగా చేయూత అందిస్తున్నారు. కొవిడ్ ఫైట్ కింద ఏపీకి రూ.8,025 కోట్లు ఇచ్చాం. ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ సంస్థల పనుల్లో ఒప్పందాలు ఉల్లంఘించకూడదు. ఇష్టం వచ్చినట్లు చేయడం వల్ల ప్రాజెక్టుల్లో అనేక ఇబ్బందులు వస్తాయి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నాను. కేంద్రం ఒక స్థాయిలో రూ.2.7కి విద్యుత్తు ఇస్తోంది. ఏపీలో రూ. తొమ్మిది ఛార్జి చేయడం విని ఆశ్చర్యపోయా. రూ. తొమ్మిది ఇచ్చి పరిశ్రమల నిర్వహణ సాధ్యమేనా ఆలోచించాలి’’ అని నిర్మల అన్నారు.
‘‘ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక నిధులు మంజూరు చేశారు. స్థూల దేశీయ ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ తొమ్మిదో ర్యాంకులో ఉంది. ఏపీలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలది ప్రముఖ స్థానం. ఏపీలోని 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.936 కోట్లు వేశాం. ఏపీలోని 546 మత్స్యాకార గ్రామాల్లో 349 పిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఏపీలోని ఆక్వా, మెరైన్ ఫిషింగ్కు రూ.11 వేల కోట్లు కేటాయించాం. ఎంత ఉపయోగించుకుంటారో రాష్ట్రానికే అవకాశం ఇచ్చాం. మత్స్య సంపద యోజన కింద ఏపీకి సాయం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. దేశంలోని సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల్లో ఏపీది మూడో ర్యాంకు. ’’ అని ఆర్థిక మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?