రాజ్‌నాథ్‌సింగ్‌తో రఘురామకృష్ణరాజు భేటీ

వైకాపా షోకాజ్‌ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆపార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ఈసీని

Published : 27 Jun 2020 10:50 IST

దిల్లీ: వైకాపా షోకాజ్‌ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆపార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ఈసీని కలిసిన రఘురామకృష్ణరాజు శనివారం ఉదయం కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో శరద్‌యాదవ్‌ తరహాలో రఘురామకృష్ణరాజుపై సస్పెన్షన్‌ వేటే వేస్తారని, పార్లమెంట్‌లో కూడా నిర్ణయం తీసుకునేలా చర్యలు ఉంటాయని వైకాపా నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన.. రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు