
Published : 27 Jun 2020 10:50 IST
రాజ్నాథ్సింగ్తో రఘురామకృష్ణరాజు భేటీ
దిల్లీ: వైకాపా షోకాజ్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆపార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. నిన్న లోక్సభ స్పీకర్ ఓంబిర్లా, ఈసీని కలిసిన రఘురామకృష్ణరాజు శనివారం ఉదయం కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్తో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో శరద్యాదవ్ తరహాలో రఘురామకృష్ణరాజుపై సస్పెన్షన్ వేటే వేస్తారని, పార్లమెంట్లో కూడా నిర్ణయం తీసుకునేలా చర్యలు ఉంటాయని వైకాపా నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన.. రాజ్నాథ్ సింగ్తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
Tags :