‘సొంత పరిశ్రమ కోసం నీటి చౌర్యం చేస్తారా?’

సొంత వ్యాపార సంస్థ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జల చౌర్యానికి పాల్పడ్డారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు.

Published : 29 Jun 2020 01:49 IST

సీఎం జగన్‌కు పట్టాభి ప్రశ్న

అమరావతి: సొంత వ్యాపార సంస్థ కోసం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జల చౌర్యానికి పాల్పడ్డారని తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. నిబంధనల ప్రకారం అనుమతించిన దానికంటే రెట్టింపు నీటిని సరస్వతి ఇండస్ట్రీస్‌కు మళ్లిస్తూ జారీ చేసిన జీవో అక్రమం అని పట్టాభి అన్నారు. అక్రమ జలకేటాయింపుల జీవోను తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో సీఎం జగన్‌మోహన్‌మోహన్‌ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. సరస్వతి ఇండస్ట్రీస్‌ కోసం సీఎం జగన్‌ అడుగడుగునా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. 

‘‘సరస్వతి ఇండస్ట్రీస్‌ సంవత్సరానికి 0.036 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించే అవకాశం ఉందని పర్యావరణ శాఖ స్పష్టం చెప్పింది. అయితే దానికి రెండింతల నీటిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఓ పక్క రైతులకు నీరందక పంటలు ఎండిపోతుంటే... ఇలా సొంత పరిశ్రమ కోసం నీటి చౌర్యం చేస్తారా?’’ అని పట్టాభి ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని