‘ఎన్డీఏ హయాంలోనే చైనా దిగుమతులు పెరిగాయ్’
చైనా ఉత్పత్తుల్ని నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓవైపు ‘భారత్లో తయారీ’ అంటూనే మరోవైపు మోదీ నేతృత్వంలో భాజపా సర్కార్ చైనా నుంచి దిగుమతుల్ని పెంచుకుందని ఆరోపించారు.........
భాజపా సర్కార్పై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
దిల్లీ: చైనా ఉత్పత్తుల్ని నిషేధించాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఓవైపు ‘భారత్లో తయారీ’ అంటూనే మరోవైపు మోదీ నేతృత్వంలో భాజపా సర్కార్ చైనా నుంచి దిగుమతుల్ని పెంచుకుందని ఆరోపించారు. వాస్తవాల్ని దాచలేరంటూ.. యూపీఏ సర్కార్ నాటి చైనా దిగుమతుల్ని తాజా ఎన్డీఏ ప్రభుత్వ హయాంతో పోలుస్తూ ఓ గ్రాఫ్ను ట్విటర్లో ఉంచారు. యూపీఏ హయాంలో 12-13 శాతంగా ఉన్న చైనా దిగుమతులు.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత 17-18 శాతానికి పెరిగినట్లు ఆ గ్రాఫ్లో గమనించవచ్చు. గల్వాన్లో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ తర్వాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. చైనా చొరబాట్లపై వాస్తవాల్ని తెలియజేయాలంటూ పలుసార్లు ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అలాగే ఈ సమస్య పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో కూడా వివరించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్