‘అధికారపక్షం తప్పులు చెప్పకూడదా?’

‘‘వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు.

Published : 01 Jul 2020 19:34 IST

డీజీపీ కలిసిన తెదేపా నేతలు

అమరావతి: ‘‘వేధింపులకు గురిచేస్తున్న ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు. ఎస్సీలపై దాడులను ఏ మాత్రం సహించం’’ అని తెదేపా నాయకులు అన్నారు. గురజాలలో విక్రమ్‌ను హత్య చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెదేపా నాయకులు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను కలసి కోరారు. ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ ‘‘మా ఆరోపణలపై సమాధానం చెప్పలేక వైకాపా నేతలు పారిపోతున్నారు. బెదిరింపులు, ప్రలోభాలతో ఎవరినీ భయపెట్టలేరు. ఇకనైనా కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. అధికారపక్ష నేతలు చేస్తున్న తప్పులను చెప్పకూడదా. అణచివేత ధోరణి ఎన్నాళ్లు కొనసాగిస్తారు’’ అని తెదేపా నాయకులు ప్రశ్నించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని