‘‘వాళ్ల ప్రాజెక్టులు ఏకంగా కొట్టుకుపోయాయి’’
కొండపోచమ్మ సాగర్ కాల్వ లీకేజీపై కాంగ్రెస్, భాజపా గ్లోబెల్ ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
ప్రతిపక్షాల విమర్శలపై మంత్రి హరీశ్రావు వ్యాఖ్య
సిద్దిపేట: కొండపోచమ్మ సాగర్ కాల్వ లీకేజీపై కాంగ్రెస్, భాజపా గ్లోబెల్ ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. చిన్న కాల్వ తెగితే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులు ఏకంగా కొట్టుకుపోయిన విషయం మరిచిపోవద్దని సూచించారు. 2007లో ఖమ్మం జిల్లా పాలెం వాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సిద్ధం కాకముందే కొట్టుకుపోయిందన్నారు. ఎల్లంపల్లి నిర్మాణంలో లోపం ఉందని కాంగ్రెస్ వదిలేసిందని హరీశ్రావు వ్యాఖ్యానించారు. దేవాదుల ప్రాజెక్టు పైపులు పటాకులు లాగా పేలిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే అని మంత్రి అన్నారు. గుజరాత్లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కాల్వలకు 200 సార్లు గండిపడిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!