హైకోర్టును ఆశ్రయించిన రఘురామకృష్ణరాజు
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. ..
అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు, సస్పెన్షన్ చర్యలు అడ్డుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. తాను పార్టీ వ్యతిరేకంగా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని పిటిషన్లో పేర్కొన్నారు.
యువజన రైతు శ్రామిక పార్టీ తరఫున తాను ఎన్నికయ్యాయని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్హెడ్పై తనకు షోకాజ్ నోటీసు ఇచ్చారని రఘురామకృష్ణరాజు వివరించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లానని, ఈసీ నిర్ణయం తీసుకునే వరకు తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలని పిటిషన్లో కోరారు. ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులను మాత్రమే హైకోర్టు విచారిస్తోంది. రఘురామకృష్ణరాజు పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.