అమరావతి పేరుతో ప్రభుత్వం రాక్షస క్రీడ

అమరావతి అనేది తెలుగువాళ్ల ఆత్మగౌరవ విషయమని భాజపా నేత, కేంద్ర మాజీ .....

Published : 04 Jul 2020 15:00 IST

భాజపా నేత పురందేశ్వరి వ్యాఖ్య

అమరావతి: అమరావతి అనేది తెలుగువాళ్ల ఆత్మగౌరవ విషయమని భాజపా నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అన్నారు. రాష్ట్రాభివృద్ధితో ఇది ముడిపడిన అంశమని చెప్పారు. అమరావతి కోసం పోరాడుతున్న వారంతా మహనీయులని కొనియాడారు. అమరావతి పేరుతో ఈ ప్రభుత్వం రాక్షస క్రీడ ఆడుతోందని మండిపడ్డారు. పాత ప్రభుత్వ నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం కొనసాగించాలన్నారు. అమరావతి కోసం మహిళల ఉద్యమం ప్రశంసనీయమనీ.. అమరావతి రైతుల ఉద్యమానికి భాజపా మద్దతు ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని