సీఐఏకు అన్నివిధాలా అండగా ఉంటాం: కేటీఆర్
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సీఐఐకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల.....
హైదరాబాద్: నిర్మాణ పరికరాల తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండియా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫెక్చరర్స్ అసోసియేషన్ (సీఐఏ) ఆధ్వర్యంలో జరిగిన వెబినార్లో మంత్రి పాల్గొన్నారు. ఇప్పటికే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ తయారీకి ప్రత్యేక పార్కు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ‘‘ రోడ్డు, సాగునీటి ప్రాజెక్టులు సహా పలు నిర్మాణాలతో సీఐఏకు అనేక అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాలపై కొవిడ్ ప్రభావం పడింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనులు కొనసాగుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి ప్రాధాన్యతలుగా పాలన కొనసాగుతోంది. ఎక్స్కాన్ వంటి కార్యక్రమాలను సీఐఏ హైదరాబాద్లో నిర్వహించాలి. సీఐఏ సవాళ్లు, అవకాశాలపై ప్రభుత్వాలకు నివేదిక ఇవ్వాలి. స్వదేశీ తయారీ రంగానికి మరింత ప్రాధాన్యమివ్వాలి’’ అని కోరారు. మరో వైపు, రాష్ట్రంలో మౌలిక వసతుల ప్రాజెక్టును సీఐఏ అభినందించింది. మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?