‘‘చిరుద్యోగుల్లో ఎందుకు భేదాలు సృష్టిస్తున్నారు?’’

విజయవాడలోని దుర్గగుడి పొరుగుసేవల సిబ్బందికి ప్రభుత్వం సరిగా పని కల్పించడం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Published : 06 Jul 2020 20:49 IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: విజయవాడలోని దుర్గగుడి పొరుగుసేవల సిబ్బందికి ప్రభుత్వం సరిగా పని కల్పించడం లేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దుర్గగుడిలో పని చేస్తున్న పొరుగుసేవల సిబ్బంది సమస్యలపై పవన్‌ స్పందించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ట్విటర్‌ పేజీలో ట్వీట్‌ చేశారు. దుర్గగుడిలో పదేళ్లుగా పని చేస్తున్నవారిలో ప్రస్తుతం కొందరికే పని కల్పిస్తున్నారన్నారు. చిరుద్యోగుల్లో ఎందుకు భేదాలు సృష్టిస్తున్నారో ప్రభుత్వం జవాబు చెప్పాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. ‘‘మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని సిబ్బంది వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పొరుగుసేవల సిబ్బందిని ఆదుకోవాలి’’ అని పవన్‌ కోరారు. t


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు