‘‘తాజా ఆరోపణలకూ సమాధానం లభిస్తుంది’’
అస్తవ్యస్త నిర్మాణాలతో తెలంగాణ సచివాలయం ప్రజల అవసరాలను తీర్చలేకపోతోందని ఎంపీ వినోద్కుమార్ అన్నారు. కొత్త సచివాలయం అందుబాటులోకి వస్తే..ప్రజలందరికీ ఓకేచోట నుంచి సేవలు అందించే అవకాశముంటుందన్నారు. సచివాలయ భవనం కూల్చివేత నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రతిపక్షాల ఆరోపణలకు....
ఎంపీ వినోద్ కుమార్
హైదరాబాద్: అస్తవ్యస్త నిర్మాణాలతో తెలంగాణ సచివాలయం ప్రజల అవసరాలను తీర్చలేకపోతోందని తెరాస నేత, ఎంపీ వినోద్కుమార్ అన్నారు. కొత్త సచివాలయం అందుబాటులోకి వస్తే.. ప్రజలందరికీ ఒకేచోట నుంచి సేవలు అందించే అవకాశముంటుందన్నారు. సచివాలయ భవనం కూల్చివేత నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రతిపక్షాల ఆరోపణలకు కాళేశ్వరం ప్రాజెక్టు సరైన సమాధానం చెప్పిందని, అలాగే కొత్త సచివాలయ భవనం అందుబాటులోకి వచ్చాక తాజా ఆరోపణలకు కూడా సరైన సమాధానం లభిస్తుందని తెలిపారు
ఇవాళ తెల్లవారుజాము నుంచి భారీ పోలీసు బందోబస్తు నడుమ తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు భారీ స్థాయిలో విమర్శలు సంధించాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో బాధాకరమైన రోజని, ముఖ్యమంత్రి కేసీఆర్ మూఢ నమ్మకాల కోసం నాలుగు కోట్ల మంది ప్రజలను పణంగా పెట్టారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తప్పులు చేస్తే న్యాయవ్యవస్థ కలుగజేసుకునేది.. తెలంగాణ చరిత్రలో ఈ రోజును బ్లాక్ డే గా కాంగ్రెస్ నేతలు అభివర్ణించారు.ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి నిధులు లేవంటూ..రూ.500 కోట్లతో సచివాలయం నిర్మాణం అవసరమా?అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!