‘‘ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి’’

‘‘రాష్ట్రంలో కరోనా ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం లేక చాలామంది ప్రైవేటుకు వెళ్తున్నారు’’

Updated : 12 Jul 2020 19:05 IST

కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: ‘‘రాష్ట్రంలో కరోనా ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం లేక చాలామంది ప్రైవేటుకు వెళ్తున్నారు’’ అని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. గాంధీ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం కిషన్‌ రెడ్డి ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించి ప్రజల్లో నమ్మకం కలిగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

‘‘లాక్‌డౌన్‌, కంటైన్మెంట్‌ జోన్ల విషయంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది. కరోనా కట్టడికి రాష్ట్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కరోనా పరీక్షలను మరింత వేగవంతం చేయాలి. ఇప్పటివరకు తెలంగాణకు కేంద్రం 2.40 లక్షల పీపీఈ కిట్లను పంపించింది. ఇప్పటికే 800 వెంటిలేటర్లు రాగా, మరో 1,200 పంపించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. రెండు లక్షలకుపైగా ఆర్టీపీసీఆర్‌ టెస్టు కిట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయి. ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఏర్పాట్ల కోసం కేంద్రం రూ.200 కోట్లు ఇచ్చింది’’ అని కిషన్‌ రెడ్డి తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని