ప్రభుత్వానికి ఆ అధికారం ఎవరిచ్చారు?

నిమ్మగడ్డ రమేశ్‌ను ప్రభుత్వం ఎస్‌ఈసీగా పునరుద్ధరించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడం

Published : 24 Jul 2020 17:33 IST

తెదేపా నేత సోమిరెడ్డి

అమరావతి: నిమ్మగడ్డ రమేశ్‌ను ప్రభుత్వం ఎస్‌ఈసీగా పునరుద్ధరించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడం రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నట్లేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే నిరాకరించడాన్ని ఆయన స్వాగతించారు. రాజ్యాంగాన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి ఎవరిచ్చారని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఏపీలో ప్రభుత్వపాలన గాడి తప్పిందని, రాజ్యాంగాన్ని విస్మరిస్తోందని సుప్రీం వ్యాఖ్యలే రుజువు చేస్తున్నాయన్నారు. అధికారులంతా పాలకులకు బానిసల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా తప్పు జరిగితే శిక్ష అనుభవించాల్సింది అధికారులేనని హెచ్చరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని