గన్నవరం... గరం గరం
గన్నవరం నియోజకవర్గంలో వైకాపా శ్రేణలు ఘర్షణకు దిగాయి. ఎమ్మెల్యే వంశీ, డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్రావు వర్గాల ఘర్షణకు చినఆవుటపల్లి వేదికయ్యింది.
వైకాపా వర్గాల ఘర్షణ
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైకాపా శ్రేణలు ఘర్షణకు దిగాయి. ఎమ్మెల్యే వంశీ, డీసీసీబీ అధ్యక్షుడు యార్లగడ్డ వెంకట్రావు వర్గాల ఘర్షణకు చినఆవుటపల్లి వేదికయ్యింది. యార్లగడ్డ వర్గానికి చెందిన వినయ్ మేనల్లుడు పెదఆవుటపల్లి పరిధిలో ఒక చెరువును లీజుకు తీసుకున్నారు. అందులోని నీరు వృథా కాకుండా పొలంలోని గడ్డి సాగుకు మళ్లించారు. ఈ విషయమై వినయ్, అదే గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వంశీ అనుచరుడు గోగులమూడి దుర్గారావు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలు ఆత్కూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాయి. విషయం తెలుసుకున్న కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు స్టేషన్ వద్దకు వచ్చారు. తన వర్గీయులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్సై శ్రీనివాస్ను కోరగా మరింత ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుస్టేషన్ పక్కనే జాతీయ రహదారి ఉండటం, భారీగా జనం రావడంతో గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. వివాదం విషయం తెలిసి వైకాపా సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్రరావు స్టేషన్కు రావడంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. దుట్టా మాట్లాడుతూ ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నాయకుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.ఈ ఘటనకు సంబంధించి చినఆవుటపల్లిలో మరో వాదన కూడా వినిపిస్తుంది. ఇటీవల ఎమ్మెల్యే వంశీ పాల్గొన్న కార్యక్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి చురుగ్గా వ్యవహిరించారని ఆ ఉద్యోగి బంధువు పంచాయతీ బరిలో ఉన్నారని చెబుతున్నారు. దీనిపై మాలమహానాడు నేతలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు వెనుక వినయ్ వర్గం ఉందన్న అనుమానం నేపథ్యంలో ఘర్షణకు బీజం పడిందని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్