TS Politics: తెరాస-భాజపా శ్రేణుల ఘర్షణ

సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో తెరాస-భాజపా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Updated : 12 Oct 2022 14:34 IST

సిరిసిల్ల పట్టణం : సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తాలో తెరాస-భాజపా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దళితబంధు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా తెరాస నేతలు అంబేడ్కర్ చౌరస్తాలో ఉత్సవాలు చేస్తుండగా.. అదే సమయంలో భాజపా నేతలు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దిష్టిబొమ్మతో అక్కడికి చేరుకున్నారు. దీంతో రెండు పార్టీల నాయకుల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలో ఒకరిపైఒకరు దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు పార్టీల నేతలకు సర్దిచెప్పి పంపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని