UP Elections: అటు వరుణ్.. ఇటు ప్రియాంక
త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
యోగి సర్కారుపై అక్కాతమ్ముళ్ల విమర్శల దాడి
కాంగ్రెస్ గూటికి మేనకా గాంధీ తనయుడు?
లఖ్నవూ: త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తర్ప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ యూపీ సర్కారును లక్ష్యంగా చేసుకుని భాజపాపై విమర్శల దాడికి దిగుతుంటే... మరోవైపు ఆమె సోదరుడు, భాజపా ఎంపీ వరుణ్గాంధీ సొంత పార్టీ తీరును ఎండగడుతున్నారు. దీంతో వీరిద్దరూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు కొరకరాని కొయ్యలా మారారు. ప్రియాంక చిన్నమ్మ మేనకాగాంధీ కుమారుడైన వరుణ్... పీలీభీత్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్దికాలంగా ఆయన సొంత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ప్రియాంక కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ, కాం గ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిం పుతూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వరుణ్ కాంగ్రెస్ గూటికి చేరతారని, ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రియాంక ప్రయత్నిస్తున్నారని ప్రచారం ఊపందుకొంది.
తల్లిని తప్పించినందుకే?
భాజపా తనను నిర్లక్ష్యం చేస్తోందన్న భావనతో వరుణ్ గాంధీ ఉన్నట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. తన తల్లి మేనకా గాంధీని పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించడం ఆయన్ను మరింత బాధపెట్టినట్టు చెబుతున్నారు. అక్టోబరు 3న భాజపాకు చెందిన కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్ర కుమారుడి కాన్వాయ్... లఖింపుర్ ఖేరీలో రైతులపైకి దూసుకెళ్లింది. అనంతరం హింస చోటుచేసుకుంది. ఈ ఘటనల్లో మొత్తం 8 మంది మృతిచెందడం దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. దీనికి బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలని, ఆయన కుమారుడిపై చర్యలు తీసుకోవాలని ప్రియాంక, వరుణ్లు డిమాండ్ చేశారు. రైతులపైకి మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన వీడియోలను తమ ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న రైతులకు వరుణ్ మద్దతు ప్రకటించారు. చెరకు కనీస మద్దతు ధరను యోగి ప్రభుత్వం రూ.250 నుంచి రూ.350కి పెంచగా, దాన్ని రూ.400 చేయాలని వరుణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఆయన కోరినట్టే ప్రతిపక్షాలు కూడా చెరకు కనీస మద్దతు ధరను రూ.400కు పెంచాలని డిమాండ్ చేశాయి. ఇలాంటి పోకడతో యోగికి వరుణ్ పెద్ద తలనొప్పిలా మారారు.
పాత విషయాలను మర్చిపోయి...
ప్రియాంకకు సోదరుడు వరుణ్తో ఉన్న అనుబంధం, ఆయనపై ఉన్న నమ్మకం రోజురోజుకూ పెరుగుతున్నట్టు గాంధీ కుటుంబ వర్గాలు తెలిపాయి. పాత విషయాలన్నీ మరచిపోయి, వరుణ్ను కాంగ్రెస్లోకి తీసుకురావాలని ఆమె కోరుకుంటున్నట్టు పేర్కొన్నాయి. ‘వరుణ్ దారితప్పాడు. ఆయనకు ఓటు వేయవద్దు’ అని గతంలో ప్రియాంక వ్యాఖ్యానించారు. తాజా పరిణామాల నేపథ్యంలో- వరుణ్ త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరతారని, అక్కతో ఆయన మాట్లాడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే, అక్కాతమ్ముళ్లు కలిసి యోగి సర్కారుకు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టే అవకాశం ఉంటుందని, ఈ పరిణామం ఎన్నికల ముందు భాజపాకు ప్రతికూలంగా మారుతుందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. -
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే
పశ్చిమబెంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
అమరావతి భాజపా అభ్యర్థిగా నవనీత్ రాణా
మహారాష్ట్రలోని అమరావతి నుంచి ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న సినీ నటి నవనీత్ రాణాకు భాజపా లోక్సభ టికెట్ ఇచ్చింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో తొలి నుంచి పోరాడుతున్న ఆమెను భాజపా తమ పార్టీలో చేర్చుకుని సీటు కేటాయించింది. -
అరుణాచల్ సీఎం ఖండూ ఎన్నిక ఏకగ్రీవం!
అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లు ఏకగ్రీవం కానున్నాయి. ఇందులో ముఖ్యమంత్రి పెమా ఖండూ, నలుగురు భాజపా నేతలున్నారు. -
ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు నా దగ్గర లేదు
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు తనవద్ద లేదని, అందుకే భాజపా ఇచ్చిన ఆఫర్ను తిరస్కరించానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.