Congress: రూ.4 లక్షల పరిహారానికి కాంగ్రెస్ ఆన్లైన్ ఉద్యమం
దేశంలో కరోనా కారణంగా చనిపోయినవారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.4 లక్షల వంతున పరిహారాన్ని అందించాలనే డిమాండుతో
ప్రభుత్వం నిద్రమత్తులో ఉందన్న రాహుల్
దిల్లీ: దేశంలో కరోనా కారణంగా చనిపోయినవారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ.4 లక్షల వంతున పరిహారాన్ని అందించాలనే డిమాండుతో కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ శనివారం ఈ ఉద్యమాన్ని ట్విటర్లో ప్రారంభిస్తూ.. ప్రజలంతా తీవ్ర కష్టనష్టాలు ఎదుర్కొంటుంటే ప్రభుత్వం నిద్రమత్తులో ఉందని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తట్టి లేపాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాతో దేశంలో ఎంతమంది చనిపోయారనే కచ్చితమైన లెక్కల్ని ప్రభుత్వం వెల్లడించాలని, అలాంటివారి కుటుంబాలన్నింటికీ పరిహారం చెల్లించాలనీ డిమాండ్ చేశారు. మృతుల సంఖ్యను తగ్గించి చూపడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఆదుకొనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదని, మృతుల వివరాలు కావాలంటే వాటిని ప్రభుత్వానికి ఇచ్చేందుకు యావద్దేశం సిద్ధంగా ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చెప్పారు. విపత్తు నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాల్సి ఉంటే కేవలం రూ.50,000తో సరిపెట్టేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
బతిమాలినా..భయపెట్టినా.. ఉండేదేలే..!
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
-
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 ఎగువనే నిఫ్టీ
-
నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ
-
అమెరికా వైదొలగితే.. ప్రపంచానికి ఎవరు నాయకత్వం వహిస్తారు?: బైడెన్