Goreti Venkanna:గోరటి కవితకు జాతీయ ఘనత
ప్రముఖ కవి, తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. అద్భుతమైన ప్రకృతి వర్ణనతో కూడిన 32 గేయ కవితలతో ఆయన వెలువరించిన ‘వల్లంకి తాళం’ సంకలనానికి 2021కి గాను
‘వల్లంకి తాళం’ కవితా సంకలనానికి గుర్తింపు
తగుళ్ల గోపాల్కు సాహిత్య అకాడమీ యువ పురస్కారం
దేవరాజు మహారాజుకు బాల సాహిత్య పురస్కారం
ఈనాడు-దిల్లీ, హైదరాబాద్: ప్రముఖ కవి, తెలంగాణ శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్నను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. అద్భుతమైన ప్రకృతి వర్ణనతో కూడిన 32 గేయ కవితలతో ఆయన వెలువరించిన ‘వల్లంకి తాళం’ సంకలనానికి 2021కి గాను ఈ పురస్కారం దక్కింది. దేశవ్యాప్తంగా 20 భాషల్లో వెలువడిన రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను ప్రకటించింది. కేంద్ర సాహిత్య యువ, బాల పురస్కారాలనూ ప్రకటించింది. కేంద్ర సాహిత్య పురస్కారం కింద రూ.లక్ష, తామ్ర పత్రం బహూకరిస్తారు. యువ, బాల పురస్కారాలకు రూ.50 వేల నగదు, తామ్రఫలకం ప్రదానం చేస్తారు. తెలుగు భాష నుంచి గోరటి వెంకన్నకు పురస్కారం దక్కింది.
‘గాలి పెదవులు తాకి వెదురు గానాలు
నీలి మబ్బులజూసి నెమలి నాట్యాలు
వద్ది మద్దెల మీద వల్లంకి తాళాలు
ఆటలపాటల దరువుకడవి తొలి గురువు’
అంటూ అద్భుతమైన ప్రకృతి వర్ణనతో మనస్సును కట్టిపడేసే 32 కవితలతో ‘వల్లంకి తాళం’ కవితా సంకలనాన్ని గోరటి వెంకన్న వెలువరించారు. ‘‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల..., గల్లీ సిన్నది..గరీబోళ్ల కథ పెద్దది’’ వంటి పాటలతో ప్రసిద్ధి చెందిన కవి గోరటి వెంకన్న (వెంకటయ్య) నాగర్కర్నూలు జిల్లా గౌరారంలో 1963లో నర్సింహా, ఈరమ్మ దంపతులకు జన్మించారు. తెలుగులో ఎంఏ పూర్తి చేశారు. నాలుగు దశాబ్దాలుగా ఆయన పలు పుస్తకాలను, కవితలు, పాటలను రాశారు. తెలంగాణ జానపదాన్ని తన పాటల ద్వారా విశ్వవ్యాప్తం చేశారు. పల్లె ప్రజల జీవన విధానం, రైతుల జీవితాలు, కులవృత్తులపైనే ఆయన ఎక్కువగా రచనలు చేశారు. ఈ పురస్కారానికి నందిని సిధారెడ్డి నీటి మనసు, అమ్మంగి వేణుగోపాల్ సహృదయ సాహిత్య విమర్శ వైవిధ్యం, సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి కొండపొలంతో పాటు మరో పది రచనలు పరిశీలనకు వచ్చాయి. జ్యూరీ సభ్యులుగా డాక్టర్ సి.మృణాళిని, జి.శ్రీరామమూర్తి, డాక్టర్ కాత్యాయనీ విద్మహే వ్యవహరించారు.
‘దండకడియం’కు గుర్తింపు
సాహిత్య అకాడమీ యువ పురస్కార్కు తగుళ్ల గోపాల్ కవితా సంకలనం ‘దండకడియం’ ఎంపికైంది. గోపాల్ స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ.
* కేంద్ర సాహిత్య బాల పురస్కారానికి దేవరాజు మహారాజు రచన ‘నేను అంటే ఎవరు?’ (ఒక వైజ్ఞానిక వివరణ) ఎంపికైంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడపర్తి ఆయన స్వగ్రామం. జంతుశాస్త్రం ప్రొఫెసర్ అయిన దేవరాజు మహారాజు సుమారు మూడు దశాబ్దాలుగా రచనా వ్యాసంగంలో కొనసాగుతున్నారు. తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లోనూ కథా సంపుటాలు, కథలు వెలువరించడంతో పాటు పలు అనువాదాలు చేశారు.
తెలంగాణ సాహిత్యానికి, మట్టి మనిషి జీవన తాత్వికతకు గౌరవం: సీఎం కేసీఆర్
గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం... తెలంగాణ సాహిత్యానికి, మట్టి మనిషి జీవనతాత్వికతకు దక్కిన గౌరవమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వల్లంకి తాళం కవితా సంపుటికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కడం గొప్ప విషయమని ఆయన హర్షం వ్యక్తంచేశారు. గోరటి వెంకన్నకు ఏపీ సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు.
సాహితీ ప్రపంచంలో ఇది చాలా గొప్ప పురస్కారం. ఎంతో ప్రతిష్ఠాత్మకమైంది. వాగ్గేయ కవితా సంప్రదాయానికి దీనిని ప్రకటించడం ఆనందంగా ఉంది. నా జీవితానికి ఇదో మధురానుభూతి. మానవీయ సంస్కృతి, స్వచ్ఛమైన ప్రకృతి మేళవింపు నా ‘వల్లంకి తాళం’.
-గోరటి వెంకన్న
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్ర బిందువులుగా మార్చి సీఎం జగన్ భ్రష్టు పట్టిస్తే.. ఆయన ప్రభుత్వంలో అత్యున్నతాధికారి తన మేనల్లుడి కోసం ద్రవిడ విశ్వవిద్యాలయం నిబంధనలనే కాలరాశారు. -
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో వాలంటీర్లు పాల్గొనకూడదనే నిబంధన ఉన్నా.. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలోని వాలంటీరు వై.లక్ష్మీనారాయణరెడ్డి దాన్ని ఉల్లంఘించారు. -
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాల స్తంభన
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ బ్యాంకు ఖాతాలను పోలీసులు ఫ్రీజ్ చేశారు. నెల్లూరు పోలీసులు లేఖ రాయడంతో.. హైదరాబాద్లోని హిమాయత్నగర్, ఖైరతాబాద్ శాఖల్లో ఉన్న నాలుగు ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిసింది. -
హమ్మయ్య.. జగన్ పర్యటనల నుంచి అవస్థలు తప్పాయి
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ముఖ్యమంత్రి జగన్ పర్యటనలు, సభల నుంచి ప్రజలకు అవస్థలు తప్పాయి. గడిచిన నాలుగున్నరేళ్లలో ఆయన ఉమ్మడి కర్నూలు జిల్లాకు వచ్చిన ప్రతిసారీ భద్రత పేరుతో దుకాణాలు మూయించి, వాటికి అడ్డంగా బారికేడ్లు పెట్టేవారు. -
జగన్.. సొంత జిల్లా ప్రజలకు మాటిస్తివి.. ఏమార్చితివి!
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు అయిదేళ్ల పాటు అరచేతిలో వైకుంఠం చూపించిన సీఎం జగన్.. తన సొంత ఇలాకా వైయస్ఆర్ జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు పరిశ్రమలను కూడా ఏర్పాటు చేయించలేకపోయారు. -
ఎండలు ముదిరాయి.. సెగ పెరిగింది
రాష్ట్రంలో ఎండలు ముదురుతున్నాయి. సెగ పెరుగుతోంది. గురువారం ఉత్తరకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 31 మండలాల్లో వడగాలులు వీచాయి. -
రంగులు తొలగిస్తే ఊరుకోను.. వైకాపా నాయకుడి వీరంగం
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం పంచాయతీ సర్పంచి గంగాభవాని భర్త, వైకాపా నాయకుడు సుంకర నరసింహారావు తన దుకాణంపై వేసిన పార్టీ రంగులను తొలగిస్తే సహించేది లేదంటూ అధికారులపై విరుచుకుపడ్డారు. -
కన్నారా.. ఇది విన్నారా?
ఎన్నికల నియమావళి ఉల్లంఘన విషయంలో వైకాపా నేతల బరితెగింపు తారస్థాయికి చేరింది. కాకినాడ జిల్లా వైకాపా అధ్యక్షుడు, కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభ్యర్థి కురసాల కన్నబాబు ఓ అడుగు ముందుకేసి జిల్లా ఎన్నికల అధికారి ప్రసంగాన్ని రికార్డు చేసి ఊరూవాడా ప్రదర్శిస్తూ వైకాపా ప్రచారానికి తెగ వాడేస్తుండటం వివాదాస్పదంగా మారింది. -
ఇలా అయితే.. విద్యావ్యవస్థ నాశనం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధనేతర సిబ్బంది (లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లు) ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
సర్వం జగన్నామం
గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. -
బ్రహ్మ రాకాసి!
అలనాడు బ్రహ్మనాయుడు తిరగాడిన నేల అది. ఆ యోధుడు కదనరంగంలో కాలుమోపితే చాలు.. యుద్ధభూమే కంపించిపోయేది.. అంతటి పరాక్రమం బ్రహ్మనాయుడి సొంతం. -
వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
పోర్టు ద్వారా గంజాయి వ్యాపారం చేసేందుకే విశాఖను రాజధానిగా చేస్తామంటున్నారు. అందుకే 25 వేల కేజీల మాదక ద్రవ్యాలను అక్కడ దించారు. -
నాడు దర్జా.. నేడు గజగజ!
తాచెడ్డ కోతి వనమంతా పాడు చేసిందని... ఒక్కసారి అవకాశం ఇవ్వండని వేడుకుని, అధికారం దక్కించుకున్న జగన్ రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను దారుణంగా కుప్పకూల్చారు. -
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
వైకాపా తరఫున పోలవరం శాసనసభ (ఎస్టీ) నియోజకవర్గం అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్న తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. -
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
ఎన్నికలు వచ్చాయంటే సామాన్యులకు పండగే అంటారు. కానీ, ఓ విషయంలో మాత్రం వారికి నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
సీఎస్, డీజీపీలను బదిలీ చేయండి
‘‘ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి ఆయా హోదాల్లో కొనసాగితే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరగవు. -
వైకాపాకు ప్రచారానికే సలహాదారు ఎత్తుగడ
ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ఉద్యోగులకు మేలు చేయకపోగా.. వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ ఓ ప్రకటనలో విమర్శించారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
సూపర్ఫాస్ట్ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!
షాలిమార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వారాంతపు సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..