Raghurama: వివేకాను చంపించిన కట్టప్ప ఎవరో?

‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియడానికి రెండేళ్లు పట్టింది. బాహుబలి వంటి వివేకానందరెడ్డిని చంపించిన కట్టప్ప

Updated : 18 Feb 2022 07:25 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలియడానికి రెండేళ్లు పట్టింది. బాహుబలి వంటి వివేకానందరెడ్డిని చంపించిన కట్టప్ప ఎవరో మూడేళ్లయినా తేలడం లేదు. అది ఎవరో తేలాలి’ అని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రూ.40 కోట్లు ఇచ్చి వివేకానందరెడ్డిని హత్య చేయించే స్థోమత కడప జిల్లాలో ఎవరికి ఉందో సీబీఐ విచారణలో తేలుతుందన్నారు.

ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి దుబాయ్‌లో పది మందికి కోట్లు వేసి సమావేశం పెట్టారని.. దాన్ని చూపి రూ.3 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయని సామాజిక మాధ్యమాల్లో తమ పార్టీవారు ప్రచారం చేస్తున్నారని రఘురామ ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేసిన శంకుస్థాపన శిలాఫలకాల్లో ఎంపీలందరి పేర్లు వేసి తన పేరు వేయలేదని, దీనిపై లోక్‌సభ సభాపతికి, గడ్కరీకి లేఖలు రాయనున్నట్లు చెప్పారు. నియామకాలు చేపట్టని ఏపీపీఎస్సీకి ఛైర్మన్‌గా గౌతమ్‌ సవాంగ్‌ చేసేదేమిటని ఆయన ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని