Andhra News: ప్రజలు గౌరవంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చడం లేదనుకుంటా: పవన్
ప్రజల మంచి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్నట్లు కనిపించడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కాకినాడ, కర్నూలు నగరపాలక సంస్థల పరిధిలో ఆస్తి, చెత్త పన్నులకు సంబంధించి జరిగిన వ్యవహారాలపై ఆయన ట్విట్ చేశారు. పన్ను కట్టకపోతే...
అమరావతి: ప్రజల మంచి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తున్నట్లు కనిపించడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. కాకినాడ, కర్నూలు నగరపాలక సంస్థల పరిధిలో ఆస్తి, చెత్త పన్నులకు సంబంధించి జరిగిన వ్యవహారాలపై ఆయన ట్విట్ చేశారు. పన్ను కట్టకపోతే సామాన్లు పట్టుకుపోతామని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ట్రాక్టర్లు వేసుకొని తిరగడం ఏం సూచిస్తోందని ప్రశ్నించారు. ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనేవాళ్ళ మాదిరిగా ప్రభుత్వ వైఖరి ఉందని మండిపడ్డారు. చెత్త సేకరణకు పన్ను విధించటమే ఒక దౌర్భాగ్యం అనుకొంటే... దాన్ని వసూలు చేస్తున్న విధానం మరింత దిగజారిపోయేలా ఉందన్నారు. కర్నూలులో వ్యాపారులు చెత్త పన్ను చెల్లించలేదని దుకాణాల ముందు చెత్తను వేసి అవమానిస్తారా అని ధ్వజమెత్తారు. ఇది కచ్చితంగా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించడం ఈ ప్రభుత్వానికి నచ్చడం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్