Telangana News: మేం అసమ్మతి వర్గం కాదు.. పార్టీ బాగు కోసమే మీటింగ్‌లు : మర్రి శశిధర్‌రెడ్డి

తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని.. అవసరమైన ప్రతి చోటా

Updated : 20 Mar 2022 17:19 IST

హైదరాబాద్‌ : తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ఉందని.. అవసరమైన ప్రతి చోటా మార్పులు చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి సూచించారు. అశోక హోటల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల ‘ప్రత్యేక’ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసం తీసుకుంటుందని మాకు నమ్మకం ఉంది. రేవంత్‌రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసినా.. చన్నీని పంజాబ్‌లో సీఎంగా చేసినా.. అన్ని నిర్ణయాలు అధిష్ఠానమే తీసుకుంది. రానున్న ఎన్నికలు పార్టీకి కఠినమైన పరీక్షలాంటివి. వచ్చే ఎన్నికలు పార్టీ మనుగడకు చాలా కీలకమైనవి. మేము అసమ్మతి వర్గం కాదు. చాలా సార్లు మేము మీటింగ్‌లు పెట్టాం. పార్టీ బాగు కోసమే ఏర్పాటు చేసిన సమావేశమిది. రాష్ట్రంలో, దేశ వ్యాప్తంగా జరిగిన కొన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్లీ రాకూడదనే మేం సమావేశమవుతున్నాం. పార్టీ బలోపేతం కోసం మళ్లీ మళ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాం’ అని శశిధర్‌ రెడ్డి స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని