Nara Lokesh: లోకేశ్‌ పాదయాత్ర?.. పార్టీలో విస్తృతంగా ప్రచారం!

ప్రజలపై వైకాపా వేసిన మితిమీరిన భారాలు, ఛార్జీల పెంపుపై నిర్వహిస్తున్న

Published : 30 May 2022 06:58 IST

అమరావతి: ప్రజలపై వైకాపా వేసిన మితిమీరిన భారాలు, ఛార్జీల పెంపుపై నిర్వహిస్తున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని తెదేపా భావిస్తోంది. ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పాదయాత్ర చేస్తారన్న ప్రచారం పార్టీలో విస్తృతంగా ఉంది. మహానాడు సందర్భంగా విలేకరులతో లోకేశ్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడినప్పుడు పాదయాత్రపై ప్రశ్నిస్తే.. పార్టీ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు సిద్ధమని బదులిచ్చారు. ‘ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్ర స్థాయిలోనే కాదు.. నియోజకవర్గ స్థాయిలోనూ వైకాపా ఎమ్మెల్యేలపై పోరాడాలి’ అని పార్టీలోని మరో సీనియర్‌ నేత చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని