Revanth Reddy: బల్మూరి వెంకట్‌ను పరామర్శించిన రేవంత్‌రెడ్డి

పోలీసులు అరెస్ట్‌ చేస్తున్న క్రమంలో జరిగిన తోపులాటలో గాయపడిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ..

Published : 30 Jun 2022 14:27 IST

హైదరాబాద్‌: పోలీసులు అరెస్ట్‌ చేస్తున్న క్రమంలో జరిగిన తోపులాటలో గాయపడిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరామర్శించారు. సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌.. వెంకట్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న బల్మూరి వెంకట్‌పై పోలీసులు దాడి చేశారని రేవంత్‌ ఆరోపించారు. 

బుధవారం సిద్దిపేట జిల్లాలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురైన మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులను పరామర్శించేందుకు బల్మూరి వెంకట్‌ బయల్దేరారు. మార్గంమధ్యలో పోలీసులు ఆయన్ను అరెస్ట్‌ చేసి బలవంతంగా రక్షక వాహనంలో తరలిస్తుండగా కాంగ్రెస్‌ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో వెంకట్‌ తల, చేతికి గాయాలయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని