బాంచెన్ బతుకులు వద్దు
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాంచెను బతుకులు బతకొద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పాదయాత్ర కొనసాగించారు.
ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్
నాయకులు, కార్యకర్తలతో కలిసి ముందుకు సాగుతున్న బండి సంజయ్
ఈనాడు, వరంగల్, దేవరుప్పుల రూరల్, న్యూస్టుడే: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బాంచెను బతుకులు బతకొద్దని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆయన సోమవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో పాదయాత్ర కొనసాగించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రశాంతి విద్యానికేతన్లో జెండా ఎగురవేసి విద్యార్థులను ఉద్ధేశించి ప్రసంగించారు. ప్రతి విద్యార్థి కలలు కని వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడి చదవాలని సూచించారు. దేవరుప్పుల చౌరస్తాలో, స్వరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. నిజాం పాలన, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను పేదలు కోల్పోతే అధికారం మాత్రం దొరల చేతుల్లోకి వెళ్లిందన్నారు. రాక్షస, సెంటిమెంట్ల పాలనతో రాజకీయ లబ్ధి పొందుతున్న పార్టీలను ప్రజలు గుర్తించాలన్నారు.
చిన్నారిని పలకరిస్తూ..
పలకరిస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ..
ధర్మాపురంలో నిర్మించిన రెండు పడకల గదుల ఇళ్లను బండి సంజయ్ పరిశీలించారు. యాత్రలో వృద్ధులను పలకరిస్తూ, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధర్మాపురంలో మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెల్లడిస్తూ, ఒకవేళ ఇవి తప్పయితే తనపై కేసు పెట్టాలని సవాలు విసిరారు. అనంతరం ధర్మాపురానికి చెందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు టాను నాయక్ ఇంటిని సందర్శించారు. టానునాయక్ తమ్ముడు దర్గ్యా నాయక్, కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. టాను నాయక్ కుటుంబ సభ్యులందరికి భాజపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నియోజకవర్గ యాత్ర ఇన్ఛార్జి లేగ రాంమోహన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, హనుమకొండ అధ్యక్షురాలు రావు పద్మ, అధికార ప్రతినిధులు రాణి రుద్రమ, సంగప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేవీఎల్ఎన్రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, ఉడుగుల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శివరాజ్ యాదవ్, చౌడ రమేష్, కర్ర శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు దుబ్బా రాజశేఖర్ రెడ్డి, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.
రాత్రి 9.30 గంటలకు పాలకుర్తి మండలం విస్నూరుకు చేరిన పాదయాత్ర
యాత్ర కొనసాగిన గ్రామాలు..
మొదటి రోజు యాత్ర 15 కిలోమీటర్లు కొనసాగింది. దేవరుప్పుల, కొత్తవాడ, ధర్మాపురం, పాలకుర్తి మండలం మైలారం, విస్నురు గ్రామాల గుండా రాత్రి 9 గంటల వరకు పాదయాత్ర సాగింది.
ఆందోళనలతో అట్టుడికింది..
ప్రజా సంగ్రామ యాత్ర మొదటి రోజే ఆందోళనలతో అట్టుడికింది. యాత్ర మొదలవుతుండగానే భాజపా, తెరాస వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు నెలకొనడంతో పరస్పరం రాళ్లు రువ్వుకోవడం, కర్రలతో కొట్టుకోవడంతో ఆరుగురు గాయపడ్డారు. ఉన్నపళంగా ఇరు వర్గాల మధ్య తోపులాటలు, దాడులు జరగడంతో దేవురుప్పుల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గంటకుపైగా ఈ గొడవలు కొనసాగాయి. బండి సంజయ్, భాజపా నాయకులపై జరిగిన దాడిని 13 బీసీ సంఘాల తీవ్రంగా ఖండించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. -
అంబటి, అనిల్కుమార్లపై సీఈఓకు తెదేపా ఫిర్యాదు
ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్కుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. -
పొన్నూరు వైకాపా అభ్యర్థిపై చర్యలకు ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. -
రాష్ట్రంలో తొలిరోజు 229 నామినేషన్లు
రాష్ట్రంలో తొలిరోజు లోక్సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. -
21న తెదేపా అభ్యర్థులకు బి-ఫాంలు
తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు స్వయంగా బి-ఫాంలు అందజేయనున్నారు. -
పవన్ సమక్షంలో జనసేనలో చేరికలు
మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్కుమార్ సహా పలువురు నాయకులు గురువారం జనసేనలో చేరారు. -
ఎఫ్ఓఏల ద్వారా ‘ఐ ప్యాక్’కు రూ.270 కోట్ల మళ్లింపు
వాలంటీర్ల పర్యవేక్షణ, శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీల(ఎఫ్ఓఏ) ద్వారా సుమారు రూ.270 కోట్లను ఐ ప్యాక్కు జగన్ ప్రభుత్వం మళ్లించిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
డీసీసీ పదవి కోసం నా కాళ్లు పట్టుకున్న పెద్దిరెడ్డి
తన కాళ్లు పట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డీసీసీ అధ్యక్షుడయ్యారని, లేదంటే కాణిపాకంలో కానీ, తరిగొండలోగానీ ప్రమాణం చేయాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘గులకరాయి’ కేసు దర్యాప్తు సాక్షిలోనే ఎందుకొస్తోంది?: వర్ల
సీఎం జగన్పై రాయి దాడి కేసులో పోలీసుల దర్యాప్తు వివరాలు ఒక్క సాక్షి పత్రికలోనే ఎందుకొస్తున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
తేనీటి వెనక కన్నీటి ధారలు!
మన దేశంలో వేడివేడి ఛాయ్ మజాను ఆస్వాదించనివారు అరుదు. చాలా ఇళ్లలో చుట్టాలకు తొలి పలకరింపు తేనీటితోనే! పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకునేటప్పుడు.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. చాలామందికి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే!! -
12 మందికి నేరచరిత్ర
రాజస్థాన్లో లోక్సభకు పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో కొందరిపై హత్య కేసులూ ఉన్నాయి. -
నవనీత్ రాణా.. ఓ నృత్యకారిణి
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి, సినీనటి నవనీత్ రాణాపై శివసేన(యూబీటీ) నేత సంజయ్రౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి