పలాసలో అర్ధరాత్రి ఉద్రిక్తత
పలాస శ్రీనివాసనగర్లో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు గురువారం సాయంత్రం పొక్లెయిన్తో అక్కడికి చేరుకున్నారు.
ఇళ్లు తొలగిస్తామంటూ వచ్చిన అధికారులు
తెదేపా, వైకాపా నాయకుల వాగ్వాదం
పొక్లెయిన్ ముందు బైఠాయించిన బాధితులు
పలాస, న్యూస్టుడే: పలాస శ్రీనివాసనగర్లో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. 27వ వార్డు పరిధిలోని ఈ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులు గురువారం సాయంత్రం పొక్లెయిన్తో అక్కడికి చేరుకున్నారు. చెరువు గర్భంలో ఆక్రమంగా నిర్మాణాలు జరిపారని వాటిని తొలగించేందుకు వచ్చామని పేర్కొనటంతో ఆ ప్రాంతవాసులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం.. విద్యుత్తు బిల్లు, ఇంటిపన్ను చెల్లిస్తున్నాం.. ఇప్పుడు కూలగొడతామంటే మేమంతా ఎక్కడికి వెళ్లాలి’ అంటూ అడ్డు తగిలారు.
పొక్లెయిన్ రాకతో: అనంతరం అధికారులు పొక్లెయిన్తో 27వ వార్డు తెదేపా కౌన్సిలర్ జి.సూర్యనారాయణ ఇంటి వద్దకు చేరుకుని తొలగించేందుకు సిద్ధమవటంతో జనం అక్కడా బైఠాయించారు. మంత్రికి విన్నవించాక కూడా తొలగించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. రాజకీయ కక్షతోనే ఇళ్లు కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఇంతలో వైకాపా నాయకులు అక్కడకి చేరుకోవటంతో తెదేపా, వైకాపా మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బి.అశోక్ అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు.
ఈ తరహా రాజకీయాలు జిల్లాలో ఎప్పుడూ లేవు: ఎమ్మెల్యే అశోక్
పోలీసులు అధికార పార్టీకి వంత పాడుతున్నారని ఎమ్మెల్యే అశోక్ విమర్శించారు. అనంతరం పోలీసులు పొక్లెయిన్ను వెనక్కి పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా రాజకీయాలు ఈ జిల్లాలో ఎప్పుడూ లేవన్నారు. ప్రజల్ని బాధపెట్టి ఏం సాధిస్తారని నిలదీశారు. వైకాపా నేతలే సవాలు విసిరారని.. అధికారంలో ఉన్నది వారే కాబట్టి దమ్ముంటే విచారణ జరిపించి తప్పును నిరూపించాలన్నారు. అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యే అశోక్ను మందస పోలీస్ స్టేషన్కు తరలించారు. బలవంతంగా పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు.
కాళ్లు పట్టుకుని..: ఓ మహిళ పలాస తహసీల్దార్ కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. చెరువు విస్తీర్ణం పరిశీలించాలని తహసీల్దార్కు విన్నవించటంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఇంతలో వైకాపా నాయకులు విషయాన్ని మంత్రి అప్పలరాజు దృష్టికి తీసుకుని వెళ్లారు. ఆయన కొంతమందిపై ఫిర్యాదు వచ్చిందని పేర్కొనటంతో, వారిపై చర్యలు తీసుకుని మిగిలిన పేదలందరి ఇళ్లు విడిచిపెట్టాలని దుర్గ అనే మహిళ ఫోన్లో మంత్రికి విన్నవించారు. తాను కార్యాలయంలో ఉంటానని మీరంతా వస్తే పట్టాలు ఇస్తామని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశాల మేరకే...
చెరువు గర్భంలో నిర్మాణాలపై హైకోర్టు నుంచి వివరాలు కోరిన మీదట పరిశీలించాం. శ్రీనివాసనగర్ ప్రాంతంలో 52 ఇళ్లు అక్రమంగా నిర్మించారు. వాటిని తొలగించేందుకు రావటంతో స్థానికులంతా తమ ఆవేదన తెలపటంతో లిఖిత పూర్వకంగా లేఖ ఇస్తే హైకోర్టుకు సమర్పిస్తామని వారికి వివరించాం.- ఎల్.మధుసూదన్రావు, తహసీల్దార్, పలాస
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
ఇది వారణాసి, వయనాడ్ మధ్య పోరాటం
తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీని తాము కోరినా వయనాడ్ వైపే మొగ్గు చూపారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రం వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
రాహుల్ను ప్రధానిని చేయాలి: తుమ్మల
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని... రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను కోరారు. -
మాదిగలకు కాంగ్రెస్ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్లో అమీర్పేట లీలానగర్లోని తన నివాసంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. -
భాజపాను అడ్డుకుంటేనే రేవంత్కు, లౌకికవాదానికి మంచిది
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలని.. కేరళకు వెళ్లి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలపై ఆయన నోరు పారేసుకోవడం సరైంది కాదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
రేవంత్రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు: లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. -
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నాలుగు నెలల్లోనే కర్షకుల ఉసురు పోసుకుంటోందని, వారిని వేదనకు గురిచేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
భాజపాతోనే వికసిత తెలంగాణ: గోవా సీఎం
గత పదేళ్లలో తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ఆరోపించారు. -
ఈటల సేవలు దేశానికి అవసరం
కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. -
రత్నగిరి-సింధుదుర్గ్ భాజపా అభ్యర్థిగా నారాయణ్ రాణె
కేంద్రమంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది. -
భారాస నాయకులను చేర్చుకోవద్దు
భారాస నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్గౌడ్, నాయకుడు శేఖర్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుటే పెట్రోలు పోసుకుని నిరసనకు దిగారు. -
అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోతున్నా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి విముఖత వ్యక్తం చేశారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
ఎన్నికల కమిషన్ కాదు.. భాజపా కమిషన్: మమత
ముర్షీదాబాద్ రామనవమి ర్యాలీలో చోటు చేసుకున్న హింసపై పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, భాజపాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. -
ఢీకొడుతున్న ఇండియా!
రాజస్థాన్లోని 12 స్థానాలకు తొలి విడతలో భాగంగా శుక్రవారం పోలింగ్ జరగనుంది. 2,53,15,541 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
పశ్చిమ పవర్ ఎవరిది?
సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. -
నాపై కొన్ని మీడియా సంస్థల నిందలు
కేంద్ర ప్రభుత్వం, భాజపాల విధానాలు, సిద్ధాంతాలపై విమర్శలు చేస్తున్నందుకు తనను కొన్ని మీడియా సంస్థలు నిందిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. -
తొలిదశ సమరం నేడే
లోక్సభ ఎన్నికల్లో తొలిదశ కింద 102 స్థానాల్లో శుక్రవారం పోలింగు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఏడు దశల్లో ఇదే అతిపెద్దది. -
నాలుగోదశకు మొదలైన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల నాలుగో దశకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మే 13న జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ వెలువరించింది. -
‘ఇండియా’ కూటమి నేతల బెదిరింపులను కట్టడి చేయాలి
కాంగ్రెస్ సహా ‘ఇండియా’ కూటమి నేతల భాష దూషణలు, బెదిరింపులతో కూడుకొని ఉంటోందని, ఈసీ వాటిని సుమోటోగా పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని భాజపా గురువారం డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు