Vallabhaneni Vamsi: మీరు వైకాపాకు వెళ్లడం బాలేదు: ఎమ్మెల్యే వంశీని ప్రశ్నించిన మహిళ

గన్నవరం పట్టణంలోని రాయ్‌నగర్‌ పరిసరాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.

Published : 30 Nov 2022 11:07 IST

గన్నవరం: గన్నవరం పట్టణంలోని రాయ్‌నగర్‌ పరిసరాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగా కల్యాణ మండపం సమీపంలోని ఓ అపార్టుమెంట్‌కు వెళ్లిన ఎమ్మెల్యే వంశీమోహన్‌.. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ.. ‘అంతా బాగుంది గానీ మీరు వైకాపాకు వెళ్లడమే బాలేదు. స్థానికంగా ప్రతిష్ఠ కూడా  దిగజారింది’ అని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ కొన్ని పరిస్థితుల వల్ల వైకాపాకు మద్దతు పలికాల్సి వచ్చిందని, ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. తొలుత స్థానిక వాలంటీర్‌ పథకాల వివరాలు తమకు తెలియపర్చడం లేదని  మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు