Pilot Rohit Reddy: గడువు కుదరదు.. విచారణకు రావాల్సిందే: రోహిత్‌రెడ్డికి స్పష్టం చేసిన ఈడీ

మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూరు శాసనసభ్యుడు పైలట్‌ రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. 

Published : 19 Dec 2022 14:11 IST

హైదరాబాద్: మనీలాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్న తాండూరు శాసనసభ్యుడు పైలట్‌ రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ అధికారులు తిరస్కరించారు. నోటీసుల్లో అడిగిన వివరాల సేకరణకు మరికొంత సమయం పడుతుందని.. దీని కోసం ఒక వారం గడువు ఇవ్వాలని పీఏ శ్రవణ్‌ ద్వారా ఈడీ కార్యాలయానికి రోహిత్‌ లేఖ పంపించారు. కానీ గడువు ఇచ్చేందుకు ఈడీ అధికారులు నిరాకరించారు. దీంతో మధ్యాహ్నం 3గంటలకు ఈడీ కార్యాలయానికి రోహిత్‌ రెడ్డి హాజరుకానున్నారు. 

హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ సహాయ సంచాలకుడు దేవేందర్‌సింగ్‌ పేరిట శుక్రవారం అధికారులు రోహిత్‌రెడ్డికి సమన్లు జారీ చేశారు. రోహిత్‌ రెడ్డికి ఇచ్చిన నోటీసులో ఆధార్, పాన్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌తో పాటు.. తనకు, తన కుటుంబానికి చెందిన ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, కంపెనీ వివరాలు తీసుకురావాలని కోరారు. ఆదాయపన్ను చెల్లింపులతో పాటు, ఇతర క్రయ విక్రయాలకు సంబంధించి గత ఏడేళ్ల  సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా ఈడీ విచారణకు  ఈరోజు ఉదయం 10 గంటలకు రోహిత్‌ రెడ్డి హాజరుకావాల్సింది. ఈ నేపథ్యంలో  వివరాల సేకరణకు సమయం పడుతుందని.. వారం గడువు ఇవ్వాలని కోరగా ఈడీ తిరస్కరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని