Atchannaidu: తెదేపా నేతను హతమారుస్తామన్న వారిని పోలీసులు బతిమాలతారా?

గుడివాడలో తెదేపా కార్యకర్తలపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన గడ్డం గ్యాంగ్‌ నేత మెరుగుమాల కాశీ, వారి వెనకున్న కొడాలి నానిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు డిమాండు చేశారు.

Updated : 26 Dec 2022 07:43 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్న

ఈనాడు, అమరావతి: గుడివాడలో తెదేపా కార్యకర్తలపై పెట్రోల్‌తో దాడికి ప్రయత్నించిన గడ్డం గ్యాంగ్‌ నేత మెరుగుమాల కాశీ, వారి వెనకున్న కొడాలి నానిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు డిమాండు చేశారు. ‘తెదేపా నేత రావి వెంకటేశ్వరరావును హతమారుస్తామని గడ్డం గ్యాంగ్‌ బహిరంగంగా హెచ్చరిస్తుంటే పోలీసులేం చేస్తున్నారు? గడ్డం గ్యాంగ్‌ను బతిమాలడమే వారి చేతగానితనానికి నిదర్శనం. రేపు వారిపై ఇష్టారాజ్యంగా దాడి చేసినా ఇలాగే బతిమాలుతారా?’ అని ప్రకటనలో ప్రశ్నించారు. ‘గుడివాడలో తెదేపా నేతలు రంగా వర్ధంతి నిర్వహిస్తే వైకాపాకు వచ్చిన నొప్పేంటి? రంగాను చంపడంలో తప్పు లేదన్న గౌతమ్‌రెడ్డికి ఫైబర్‌నెట్‌ ఛైర్మన్‌ పదవినిచ్చిన వ్యక్తి జగన్‌రెడ్డి. గుడివాడలో ఇద్దరు కాపు సోదరుల మరణానికి నాని కారణమయ్యారు. తనకు కాపులంతా వ్యతిరేకం కావడంతో దాన్ని దారి మళ్లించేందుకు రెచ్చగొట్టే పనులు ప్రారంభించారు’ అని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని