Janasena: ‘జగన్‌కు ఊడిగం చేసుకో.. కాపుల ఊసు నీకెందుకు?’

‘మంత్రి అంబటి రాంబాబుపై మా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, బిడ్డను పోగొట్టుకున్న అభాగ్యురాలు చేసిన ఆరోపణలు నిజమని ప్రపంచమంతా నమ్మింది.

Updated : 29 Dec 2022 07:05 IST

మంత్రి అంబటిపై జనసేన నాయకుడు వెంకటేశ్వరరావు ధ్వజం

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: ‘మంత్రి అంబటి రాంబాబుపై మా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌, బిడ్డను పోగొట్టుకున్న అభాగ్యురాలు చేసిన ఆరోపణలు నిజమని ప్రపంచమంతా నమ్మింది. వాటిపై ఆయన మాత్రం వక్రభాష్యం చెబుతున్నారు’అని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సత్తెనపల్లి నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న అవినీతి, అసాంఘిక కార్యక్రమాలపై జనసేన ప్రశ్నిస్తుంటే ఏం చేయాలో తెలియక పవన్‌ కల్యాణ్‌పై మంత్రి అంబటి అసందర్భంగా విమర్శలు చేస్తున్నారు. జగన్‌కు ఊడిగం చేసుకోవాల్సిందే అంటున్నావు. చేసుకో.. కాపుల ఊసు నీకెందుకు. ప్రతిసారీ పవన్‌ కల్యాణ్‌ విషయంలో నువ్వెందుకు గోక్కుంటున్నావు. సత్తెనపల్లిలో ఏం అభివృద్ధి చేశావో చెప్పు. అంబటి చెప్పిన చోటుకు ఆధారాలతో సహా వచ్చి అవినీతి నిరూపించేందుకు జనసేన సిద్ధంగా ఉంది’ అని ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని