Janasena: ‘జగన్కు ఊడిగం చేసుకో.. కాపుల ఊసు నీకెందుకు?’
‘మంత్రి అంబటి రాంబాబుపై మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బిడ్డను పోగొట్టుకున్న అభాగ్యురాలు చేసిన ఆరోపణలు నిజమని ప్రపంచమంతా నమ్మింది.
మంత్రి అంబటిపై జనసేన నాయకుడు వెంకటేశ్వరరావు ధ్వజం
సత్తెనపల్లి, న్యూస్టుడే: ‘మంత్రి అంబటి రాంబాబుపై మా పార్టీ అధినేత పవన్ కల్యాణ్, బిడ్డను పోగొట్టుకున్న అభాగ్యురాలు చేసిన ఆరోపణలు నిజమని ప్రపంచమంతా నమ్మింది. వాటిపై ఆయన మాత్రం వక్రభాష్యం చెబుతున్నారు’అని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సత్తెనపల్లి నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న అవినీతి, అసాంఘిక కార్యక్రమాలపై జనసేన ప్రశ్నిస్తుంటే ఏం చేయాలో తెలియక పవన్ కల్యాణ్పై మంత్రి అంబటి అసందర్భంగా విమర్శలు చేస్తున్నారు. జగన్కు ఊడిగం చేసుకోవాల్సిందే అంటున్నావు. చేసుకో.. కాపుల ఊసు నీకెందుకు. ప్రతిసారీ పవన్ కల్యాణ్ విషయంలో నువ్వెందుకు గోక్కుంటున్నావు. సత్తెనపల్లిలో ఏం అభివృద్ధి చేశావో చెప్పు. అంబటి చెప్పిన చోటుకు ఆధారాలతో సహా వచ్చి అవినీతి నిరూపించేందుకు జనసేన సిద్ధంగా ఉంది’ అని ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్