Telangana Politics: ఎవరి పయనం ఎటో?
తెలంగాణ శాసనసభకు ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భారత్ రాష్ట్ర సమితి(భారాస)లో టికెట్ దక్కే అవకాశం లేనివారు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందినా.. ఆ తర్వాత అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయినవారు, హస్తం పార్టీలో విభేదాల కారణంగా బయటకు రావాలనే ఆలోచనతో ఉన్నవారు.. వీరిలో ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? వీరి పయనం ఏ వైపు ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
పార్టీలు మారే అవకాశం ఉన్నవారిపై జోరుగా చర్చ
భారాస, కాంగ్రెస్ అసంతృప్తుల భవిష్యత్ నిర్ణయాలపై ఆసక్తి
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల వ్యాఖ్యలతో వేడెక్కిన వాతావరణం
ఈనాడు - హైదరాబాద్
* మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి అధికార పార్టీలో చేరి మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఈమె చేతిలో ఓడిపోయిన తీగల కృష్ణారెడ్డి ఏం చేస్తారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
* ఇటీవల ఏర్పాటైన కాంగ్రెస్ కమిటీపై అసంతృప్తి వ్యక్తం చేసిన కొండా సురేఖ కుటుంబాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఇంకో పార్టీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలా తమకు టికెట్ వచ్చే అవకాశం లేదని నిర్ణయానికి వస్తున్న కొందరు నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తుండగా.. బలమైన అభ్యర్థుల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్న ఓ పార్టీ వారిని చేర్చుకునే కసరత్తును మరింత ముమ్మరం చేసింది.
తెలంగాణ శాసనసభకు ఎన్నికలు సమీపించేకొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. భారత్ రాష్ట్ర సమితి(భారాస)లో టికెట్ దక్కే అవకాశం లేనివారు, గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందినా.. ఆ తర్వాత అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలున్నచోట ఓడిపోయినవారు, హస్తం పార్టీలో విభేదాల కారణంగా బయటకు రావాలనే ఆలోచనతో ఉన్నవారు.. వీరిలో ఎవరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు? వీరి పయనం ఏ వైపు ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నాయకులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో చోటుచేసుకునే రాజకీయ సమీకరణాలను చెప్పకనే చెబుతున్నాయి. అధికార పార్టీలో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తాజా అసమ్మతి నేపథ్యంలో కొండా సురేఖ దంపతులు.. ఇలా అనేక మంది భవిష్యత్ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
* గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 19 మంది గెలుపొందారు. వీరిలో ఎంపీగా కూడా గెలుపొందిన ఉత్తమ్కుమార్రెడ్డి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలో తెరాస(ఇప్పటి భారాస) గెలిచింది. మిగిలిన వారిలో 12 మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు.
* 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇటీవల రాజీనామా చేసి.. భాజపా తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈయన సోదరుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి కూడా పార్టీతో విభేదాలు తీవ్రమయ్యాయి. ఇటీవల నియమించిన కమిటీల్లో చోటు లభించలేదు. దీంతో ఈయన కాంగ్రెస్లో ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలకు నెల ముందు తన భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తానని పేర్కొన్నారు. తమ్ముడు భాజపాలో చేరడం, అనూహ్య మార్పులు జరిగితే తప్ప కాంగ్రెస్లో ఉండే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఈయన ఎటు వైపు మొగ్గు చూపుతారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
* గత శాసనసభ ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్హాపూర్ నుంచి ఓడిపోగా, ఈయనపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్రెడ్డి ఆ తర్వాత అధికార పార్టీలో చేరారు. అప్పటి నుంచి రెండు గ్రూపుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. పలు సందర్భాల్లో కృష్ణారావు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని భారాసలోని కొందరు ముఖ్య నాయకులు కృష్ణారావు వైపు మొగ్గు చూపినా ఇటీవల జరిగిన పరిణామాలతో తిరిగి సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే మొగ్గుచూపే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో జూపల్లి మరో పార్టీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఉంది.
* తాండూరులోనూ ఇలాంటి వాతావరణమే కనిపిస్తోంది. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని చెబుతున్న పట్నం మహేందర్రెడ్డి వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ లభిస్తుందన్న ఆశాభావాన్ని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో రోహిత్రెడ్డి కీలకంగా మారిన నేపథ్యంలో తాండూరులో ఎలాంటి రాజకీయ మార్పులు చోటుచేసుకొంటాయో చూడాల్సి ఉంది.
ఆసక్తికరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. జిల్లావ్యాప్తంగా ప్రభావం, గుర్తింపు ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డిలు ప్రస్తుతం భారాసలోనే ఉన్నా భవిష్యత్తులో మార్పు చోటుచేసుకొనే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం హయాంలో పలు మంత్రిత్వశాఖలు నిర్వహించిన తుమ్మల నాగేశ్వరరావు.. తెలంగాణ ఏర్పడ్డాక తొలి ప్రభుత్వంలోనూ మంత్రిగా పనిచేశారు. 2016లో జరిగిన పాలేరు ఉప ఎన్నికలో గెలుపొందిన ఈయన.. 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పార్టీ అధిష్ఠానానికి, ఈయనకు మధ్య కొంత దూరం(గ్యాప్) ఏర్పడిందనే ప్రచారం జరిగినా ఆయన భారాసలోనే కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో భారాస టికెట్ లభించకపోతే అప్పుడు వేరే పార్టీ గురించి ఆలోచిస్తారనే అభిప్రాయాన్ని ఆయన అనుచరవర్గం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆయన పాలేరు నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలిస్తున్నాయి. గతంలో తెలుగుదేశంలో ఆయనకు సన్నిహితంగా ఉన్నవారంతా మళ్లీ ఆయనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. పాలేరు నుంచి గత ఎన్నికల్లో తుమ్మలపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన ఉపేందర్రెడ్డి ఆ తర్వాత తెరాస(ప్రస్తుత భారాస)లో చేరారు. ఇటీవల మునుగోడు ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి వామపక్షాలు మద్దతు పలికాయి. ఉమ్మడి జిల్లా నుంచి రెండు స్థానాలను సీపీఐ, సీపీఎంలు కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, అదీ కాంగ్రెస్ నుంచి చేరిన శాసనసభ్యుడిని కాదని తుమ్మలకు టికెట్ ఇస్తారా అన్నది వేచిచూడాలి. సీపీఎం కూడా ఈ స్థానాన్ని కోరే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తుమ్మల పయనం ఎటువైపు ఉంటుందన్నది ఆసక్తికరం కానుంది.
- మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లాలో తరచూ అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, పర్యటనలు, ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తరచూ ఏదో రూపంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో వైకాపా తరపున ఖమ్మంలో గెలుపొందడంతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం ద్వారా గుర్తింపు పొందారు. తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి తెరాస(ఇప్పటి భారాస)లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలో తాను సూచించిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదన్న కారణంతో అనధికారికంగా స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇచ్చారన్న ప్రచారం, జిల్లాలో కొందరు నాయకులతో విభేదాల నేపథ్యంలో 2019 లోక్సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. అయినప్పటికీ జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో సన్నిహితంగా ఉంటారని, ఆయన చెప్పినట్లు వింటారనే ప్రచారం ఉంది. అయితే నూతన సంవత్సరం వేడుక సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది శాసనసభ స్థానాల్లో మూడు జనరల్ ఉన్నాయి. వీటిలో ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పొంగులేటికి కొత్తగూడెం నుంచి అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం ఉంది. అయితే తనకే కాకుండా తాను సూచించిన మరికొందరికీ ఇవ్వాలని ఈయన కోరుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఈయన ఖమ్మం శాసనసభ స్థానం నుంచే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకునేందుకు మరో పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆ పార్టీ నాయకులు సంప్రదించగా తనకు పార్టీ మారే ఆలోచన లేదంటూనే ‘ఉన్న పార్టీ కాదంటే కదా’ అని అన్నట్లు సమాధానం. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల, పొంగులేటిల పయనం ఎటువైపు అన్నది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్