DL Ravindra Reddy: వివేకాను ఎవరు చంపించారో జగన్కు తెలుసు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు హంతకులు.. సూత్రధారులు ఎవరో త్వరలోనే సీబీఐ బయటపెడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
వైకాపా భూస్థాపితం కాకపోతే ప్రజలు బతికి బట్టకట్టలేరు
మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి
ఈనాడు డిజిటల్, కడప, న్యూస్టుడే, మైదుకూరు: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు హంతకులు.. సూత్రధారులు ఎవరో త్వరలోనే సీబీఐ బయటపెడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున అది తేలిన తర్వాత అన్ని విషయాలు బహిర్గతం అవుతాయని తెలిపారు. శనివారం వైయస్ఆర్ జిల్లా ఖాజీపేటలో తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివేకాను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో సీఎం జగన్కు తెలుసని చెప్పారు. హంతకుల వివరాలను సీబీఐ అధికారులు బయటపెట్టక ముందే ముఖ్యమంత్రి అసలు హంతకుల వివరాలను వెల్లడిస్తే మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించడానికి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని ఎంపీ అవినాశ్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి పావుగా వాడుకున్నారని ఆరోపించారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ కేసు తేలిన తర్వాత సీబీఐ తాడేపల్లి ప్యాలెస్ను సీబీఐ విచారిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
చంద్రబాబు సీఎం అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు
వైకాపాను భూస్థాపితం చేయకపోతే ప్రజలు బతికి బట్టకట్టలేరని, రాష్ట్రాన్ని వదిలేసి పోవాల్సి వస్తుందని రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరితోనైనా కలిసి పని చేస్తానని తెలిపారు. తెదేపా అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్ర భవిష్యత్తు ఆర్థికంగా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. స్మార్ట్ మీటర్ల పేరిట ప్రభుత్వం ప్రజలపైన భారం మోపుతోందని మండిపడ్డారు. తాను మైదుకూరు తెదేపా ఇన్ఛార్జి సుధాకర్ యాదవ్తో, మరెవరితోనైనా కలిసి పని చేస్తానని చెప్పారు. మైదుకూరు పురపాలికలో అవినీతిపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఏరోజూ ప్రశ్నించకపోగా లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. బార్ల విషయంలో అవినీతి జరిగిందని.. ఒకరి పేరుతో లైసెన్సు తీసుకుని మరొకరు నడుపుతున్నారని చెప్పారు. ఈ విషయంలో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడలేదని శ్రీమాధవరాయస్వామి ఆలయంలో ప్రమాణం చేయగలరా అని రవీంద్రారెడ్డి సవాలు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
అమరావతి నుంచి సినీ నటి నవనీత్ రాణాకు భాజపా టికెట్
అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్ రాణా ఈ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా