Ponguleti: దొంగచాటుగా కండువా కప్పుకోను: పొంగులేటి

ఒక వేళ భారాసను వీడాల్సి వస్తే దిల్లీలోనో, అమెరికాలోనో దొంగచాటుగా కండువా కప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Updated : 10 Jan 2023 07:13 IST

అన్నపురెడ్డిపల్లి, న్యూస్‌టుడే: ఒక వేళ భారాసను వీడాల్సి వస్తే దిల్లీలోనో, అమెరికాలోనో దొంగచాటుగా కండువా కప్పుకోవాల్సిన అవసరం తనకు లేదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం నడిబొడ్డున 2.50 లక్షల మంది అభిమానుల సమక్షంలో కండువా కప్పుకొంటానని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో సోమవారం విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘ఆలూ లేదు చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం’ అన్నట్లు తాను భారాసను వీడుతున్నానని మీడియానే ప్రచారం చేస్తోందని అన్నారు. అంతకుముందు పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పర్సా వెంకటేశ్వరరావు ఇంటి వద్ద కార్యకర్తలతో ఆయన కాసేపు ముచ్చటించారు. అందరికీ అండగా ఉంటానని ఈ సందర్భంగా వారికి భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని