కశ్మీర్లో కొనసాగుతున్న జోడో యాత్ర
పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర వడివడిగా సాగుతోంది. శుక్రవారం ఉదయం చిరుజల్లులు పడుతున్నప్పటికీ కథువా జిల్లా హట్లీ మోడ్ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభించారు.
పాల్గొన్న సంజయ్ రౌత్
తొలిసారి రెయిన్కోట్ ధరించిన రాహుల్
కథువా: పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర వడివడిగా సాగుతోంది. శుక్రవారం ఉదయం చిరుజల్లులు పడుతున్నప్పటికీ కథువా జిల్లా హట్లీ మోడ్ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభించారు. శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్, పరమ్వీర్చక్ర అవార్డు గ్రహీత విశ్రాంత కెప్టెన్ బానా సింగ్లతో పాటు కాంగ్రెస్ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రాహుల్తో కలిసి నడిచారు. ఇప్పటి వరకూ తెల్ల టీషర్టుతోనే పర్యటించిన రాహుల్ శుక్రవారం తొలిసారి రెయిన్కోటు ధరించారు. పలుచోట్ల వర్షం కురుస్తున్నప్పటికీ ఆయన ముందుకు సాగారు. ఓ చోట కొంతమంది భాజపా, పప్పు అని ప్లకార్డులు పట్టుకుని నిలబడగా.. వారిని చూసి రాహుల్ నవ్వుకుంటూ అభివాదం చేశారు. ఇదే సమయంలో మోదీకి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడానికి సిద్ధమైన ఓ కార్యకర్తను వలంటీర్లు నిలువరించారు. దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, అసలైన సమస్యలపై గొంతెత్తున్న నాయకుడిగా రాహుల్ను చూస్తున్నట్లు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
రాహుల్ పాదయాత్రకు సీఆర్పీఎఫ్, పోలీసు సిబ్బందితో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. జోడోయాత్రకు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని విలేకర్లతో మాట్లాడుతూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా స్పష్టంచేశారు. ఆ విషయంలో ఎలాంటి సమస్యా రాదని తెలిపారు. యాత్రను కశ్మీర్ మారుమూల ప్రాంతాల మీదుగా తీసుకెళ్లాలని స్థానిక నాయకత్వం భావిస్తోంది. ఈ విజ్ఞప్తికి ఇప్పటి వరకూ అనుమతి రాలేదని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు. ఇది సాధ్యం కాకపోతే జాతీయ రహదారిపైనే యాత్ర వెళ్లేలా మరో ప్రణాళిక రూపొందించామన్నారు. అధికారులు దేనికి అనుమతిస్తే దానిని అనుసరిస్తామని స్పష్టం చేశారు. భద్రతా కారణాల రీత్యా రూట్మ్యాప్ను ప్రకటించబోమని వెల్లడించారు. చడ్వాల్లో నిలిచిన యాత్ర తిరిగి ఆదివారం ఉదయం హీరానగర్ నుంచి ప్రారంభంకానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
మరికాసేపట్లో ప్రారంభం కావాల్సిన జనసేన ప్రచార సభలు వాయిదా పడ్డాయి. -
భీమిలి నియోజకవర్గంలో తెదేపాలోకి క్యూ కడుతున్న వైకాపా నేతలు
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో వైకాపా నాయకులు తెదేపాలోకి క్యూ కడుతున్నారు. -
సత్తెనపల్లిలో బరితెగించిన వైకాపా నేతలు.. తెదేపా శ్రేణులపై దాడి
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పెద్దమక్కెనలో వైకాపా నేతలు బరి తెగించారు. -
పార్టీ నిర్ణయం శిరోధార్యం: దేవినేని ఉమా
పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
రేపు నామినేషన్ వేయనున్న పవన్కల్యాణ్
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈ నెల 23 (మంగళవారం)న నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. -
వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటే ఎలా?
ప్రజాస్వామ్య దేశంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా న్యాయస్థానాలు రాజకీయ పార్టీలకు ఆంక్షలు విధించడం సరికాదని, దీన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. -
సొమ్ములిచ్చి.. జనాన్ని తెచ్చి!.. జగన్ బస్సు యాత్రకు నేతల ఆపసోపాలు
విశాఖలో ఆదివారం సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమంది. డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు పంచి మరీ కొన్ని కూడళ్ల వద్ద జనాలను నింపాల్సి వచ్చింది. -
ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్రకు వస్తున్నారు?
‘విశాఖ స్టీల్ప్లాంట్కు చెందిన వేల ఎకరాలను అమ్మేయాలని చెప్పి, దాన్ని అంపశయ్య మీదకు చేర్చిన సీఎం జగన్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని విశాఖకు వస్తున్నారు? నగరాన్ని గంజాయికి, డ్రగ్స్కు అడ్డాగా మార్చారు. -
శ్రీశైలం క్షేత్ర పరిధిలో.. ఎన్నికల ప్రచారంపై అధికారుల అభ్యంతరం
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. -
సొమ్ముతో ప్రచార సోకులు!
సీఎం జగన్ బస్సు యాత్ర కోసం ఆదివారం సాయంత్రం విశాఖలోని అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి వద్ద జనసమీకరణ చేశారు. -
బాబ్బాబు.. వైకాపా వీడొద్దయ్యా!
మేమంతా సిద్ధం అంటూ జగన్ బస్సు ఎక్కి భీమిలి వస్తుంటే.. ‘మేమంతా సిద్ధమే తెదేపాలోకి వెళ్లేందుకు’ అంటూ ఆనందపురం మండలం కుసులువాడ గ్రామస్థులు మూకుమ్మడిగా సైకిలెక్కారు. -
ఉద్యోగులను చూసి వణికిపోతున్న జగన్
ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ ఓట్లను తగ్గించేందుకు వైకాపా సర్కారు కుట్రలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్బాబు ఆరోపించారు. -
ఆర్జేడీలో చేరిన బిహార్లోని ఎన్డీయే ఏకైక ముస్లిం ఎంపీ
బిహార్కు చెందిన ఎల్జేపీ లోక్సభ సభ్యుడు మహబూబ్ అలీ కైసర్ ఆదివారం ఆర్జేడీలో చేరారు. ఆ రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు చెందిన ఏకైక ముస్లిం పార్లమెంటు సభ్యుడు మహబూబ్ అలీ కావడం గమనార్హం. -
హెచ్సీయూలో ఏబీవీపీ దాడులపై విచారణ జరపాలి: తమ్మినేని
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఏబీవీపీ నాయకత్వంలో వారం రోజులుగా దాడులు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
-
10 వేల పదాలతో విజయ్పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
-
రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్ ఆదేశం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్