Nagababu: వారాహి యాత్ర ఆపితే పాదయాత్ర చేస్తాం: నాగబాబు

వారాహి యాత్రను ఆపితే పాదయాత్రకు సిద్ధమేనని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు పేర్కొన్నారు.

Published : 23 Jan 2023 07:33 IST

అనంతపురం (సాయినగర్‌), న్యూస్‌టుడే: వారాహి యాత్రను ఆపితే పాదయాత్రకు సిద్ధమేనని జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు పేర్కొన్నారు. అనంతపురంలోని చెరువుకట్ట రోడ్డుపై ఏర్పడిన గుంతలను శ్రమదానంతో పూడ్చే కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన నగరంలోని ఓ హోటల్‌లో జిల్లా వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు, పార్టీ స్థితిగతులపై జనసేన కార్యకర్తలు, వీర మహిళలతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... వారాహి యాత్రకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమిస్తామన్నారు. ఇతర పార్టీలతో పొత్తుల విషయంపై స్పష్టత రాలేదని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని