అనుమతిపై నిర్ణయం ఇంకెప్పుడు?
తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27వ తేదీ నుంచి చేపట్టనున్న ‘‘యువగళం’’ పాదయాత్రకు అనుమతులపై పోలీసుశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
లోకేశ్ పాదయాత్ర ప్రారంభానికి 3 రోజులే సమయం
ఉద్దేశపూర్వకంగానే పోలీసులు తాత్సారం చేస్తున్నారంటున్న తెదేపా
అనుమతివ్వబోమని మేం చెప్పలేదు: చిత్తూరు ఎస్పీ
ఈనాడు- అమరావతి, ఈనాడు డిజిటల్- చిత్తూరు: తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27వ తేదీ నుంచి చేపట్టనున్న ‘‘యువగళం’’ పాదయాత్రకు అనుమతులపై పోలీసుశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ యాత్ర ప్రారంభానికి సమయం కేవలం మూడు రోజులే ఉన్నా పోలీసులు అనుమతి ఇవ్వకుండా తీవ్ర తాత్సారం చేస్తున్నారు. ఈ యాత్రకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసి 14 రోజులు గడుస్తోంది. ఇప్పటివరకూ పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయం ప్రకటించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అసలు అనుమతులిస్తారా? లేదా? అనే దానిపై కూడా స్పష్టత ఇవ్వడం లేదు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు జాప్యం చేస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. యాత్రకు అనుమతి కోరుతూ ఈ నెల 9న తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి లేఖ రాసిన విషయం విదితమే. దానిపై పాదయాత్రలో ఎంత మంది పాల్గొంటారు? వారి వివరాలేమిటి? రాత్రుళ్లు ఎక్కడ బస చేస్తారు? వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లు వంటి సమాచారం ఇవ్వాలంటూ సవాలక్ష యక్ష ప్రశ్నలతో రెండు రోజుల కిందట డీజీపీ ప్రత్యుత్తరమిచ్చారు. ఆ లేఖకు వర్ల రామయ్య వెంటనే సమాధానం పంపించారు. అయినా పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ప్రకటన లేదు. మరోవైపు ఈ యాత్రకు అనుమతులపై పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
చట్టప్రకారమే అనుమతులిస్తాం
- చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డి
‘‘నారా లోకేశ్ పాదయాత్రకు చట్టప్రకారమే అనుమతిలిస్తాం. అనుమతివ్వబోమని మేం చెప్పలేదు. ఆంక్షలు విధించం. ఆపాలన్న ఉద్దేశం లేదు...’’ అని చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డి పేర్కొన్నారు. ఆయన సోమవారం సాయంత్రం ఓ మీడియా ఛానల్తో మాట్లాడారు. ‘‘ఈ యాత్రకు అనుమతి కోరుతూ వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాయగా... దానిపై పలు వివరణలు కోరుతూ ఆయన సమాధానమిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీఏ మనోహర్, మాజీ మంత్రి అమరనాథ్రెడ్డి కూడా యాత్రకు అనుమతి కోరుతూ మాకు దరఖాస్తు చేసుకున్నారు. రూట్ మ్యాప్ సహా ఇతర అంశాలపై నాలుగైదు రోజులుగా వారితో మాట్లాడుతున్నాం. వివరాలు అడుగుతున్నాం...’’ అని చెప్పారు.
నేడు స్పష్టత వచ్చే అవకాశం
ఈ యాత్రకు అనుమతిచ్చారా? లేదా? అనే దానిపై మాత్రం రిషాంత్రెడ్డి స్పష్టత ఇవ్వలేదు. మంగళవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తామని చిత్తూరు జిల్లా పోలీసులు చెబుతున్నారు. పాదయాత్రకు అనుమతులు ఇస్తున్నట్లు పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం రాలేదని మాజీ మంత్రి, తెదేపా నేత అమరనాథరెడ్డి వెల్లడించారు. పోలీసు శాఖ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, తెదేపా నాయకులు, కార్యకర్తలు పాదయాత్రను విజయవంతం చేస్తారని ఆయన చెప్పారు.
పదే పదే సవాలక్ష ప్రశ్నలు.. వాటిపై కొర్రీలు
‘‘యువగళం’’ పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ జిల్లా తెదేపా నాయకులు కూడా అనుమతి కోరుతూ స్థానిక పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. తొలుత పోలీసులు అడిగిన మేరకు లోకేశ్ వాహన శ్రేణిలో ఉండే కార్ల సంఖ్య, వాటి డ్రైవర్ల వివరాలు అందించారు. అవి చాలవన్నట్లుగా మరికొన్ని ప్రశ్నలు సంధించారు. కమతమూరుకు వెళ్లే మార్గంలో నిర్వహించబోయే బహిరంగ సభకు ఎంత మంది హాజరవుతున్నారు? వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పాలని అడిగారు. తెదేపా నాయకులు దానికీ సమాధానం పంపించారు. వారు అడిగిన సమాచారం అంతా ఇచ్చారు. అయినా సరే ఇప్పటికీ అనుమతులు ఇవ్వలేదు. తాత్సారం చేసేందుకు, ఇబ్బందులు పెట్టేందుకే సవాలక్ష వివరాలు అడుగుతున్నారని, వాటికి సమాధానమిస్తున్నా సరే కావాలనే పోలీసులు స్పందించడం లేదని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
ప్రపంచంలోని అన్ని కంపెనీలను ఏపీకి తీసుకొచ్చి ఉద్యోగావకాశాలు కల్పించే బాధ్యత తనదేనని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. -
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. -
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో వ్యవసాయ పురోగతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తెలిపారు. -
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ రూ.1,823 కోట్లు చెల్లించాలని పార్టీకి ఐటీ నోటీసు రావడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. -
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
₹1,823 కోట్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. శనివారం (మార్చి 30న) దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరింది. -
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు
తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. -
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల