‘జీవో 317’ను రద్దు చేయాలనడం హాస్యాస్పదం: మంత్రి హరీశ్రావు
జీవో 317ను రద్దు చేయాలనడం హాస్యాస్పదమని మంత్రి హరీశ్రావు అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ జీవో గురించి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
సిద్దిపేట టౌన్, న్యూస్టుడే: జీవో 317ను రద్దు చేయాలనడం హాస్యాస్పదమని మంత్రి హరీశ్రావు అన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ జీవో గురించి తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు అన్యాయం చేసేవిధంగా కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయని విమర్శించారు. దేహదారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మెయిన్స్ ఉచిత శిక్షణ శిబిరాన్ని పోలీసు కన్వెన్షన్ హాలులో మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 3 నోటిఫికేషన్లు విడుదల చేశామన్నారు. అనంతరం అభ్యర్థులకు శిక్షణ ఇచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులను, పోలీసు అధికారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీపీ శ్వేత, అదనపు డీసీపీ (అడ్మిన్) మహేందర్, ఏసీపీలు ఫణిందర్, దేవారెడ్డి, చంద్రశేఖర్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
కాంగ్రెస్ నేత, ఛింద్వాడా సిట్టింగ్ ఎంపీ నకుల్ నాథ్ ఇటీవల నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. -
పదేళ్ల ‘రిపోర్టు కార్డ్’ చూపించండి.. స్మృతి ఇరానీకి కాంగ్రెస్ ప్రశ్న
మహిళలకు సంబంధించిన సమస్యలపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మౌనంగా ఉంటున్నారని.. గడిచిన పదేళ్లలో ‘రిపోర్టు కార్డు’ను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు