సంక్షిప్త వార్తలు (6)
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్లో ‘యువగళం’ పాదయాత్ర చేపట్టడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని స్వగృహం నుంచి బుధవారం మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరతారు.
లోకేశ్ పాదయాత్రకు మద్దతుగా బైక్ ర్యాలీ
ఈనాడు, హైదరాబాద్: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్లో ‘యువగళం’ పాదయాత్ర చేపట్టడానికి హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని స్వగృహం నుంచి బుధవారం మధ్యాహ్నం 1.25 గంటలకు బయల్దేరతారు. తొలుత తన తాత ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారు. లోకేశ్ పాదయాత్రకు సంఘీభావంగా పార్టీ యువ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహిస్తారని తెదేపా తెలిపింది. లోకేశ్ వెంట ఆయన స్వగృహం నుంచి ఎన్టీఆర్ ఘాట్, శంషాబాద్ వరకు బైక్ ర్యాలీ ఉంటుందని పేర్కొంది. ఎన్టీఆర్ ఘాట్కు తెలంగాణ తెదేపా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, కంభంపాటి రామ్మోహనరావు వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గణతంత్ర దినోత్సవాన్ని రాజ్భవన్కు పరిమితం చేయడం శోచనీయం: నిరంజన్
గాంధీభవన్, న్యూస్టుడే: కేసీఆర్ సీఎం అయ్యాక జాతీయ పండుగల ప్రాధాన్యాన్ని క్రమేణా తగ్గిస్తూ వస్తున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ఆరోపించారు. ఆయన మంగళవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో వేలాది మంది మధ్య ప్రతిష్ఠాత్మకంగా, హుందాగా వీటిని నిర్వహించుకునే ఆనవాయితీ ఉండేదన్నారు. తర్వాత ఈ పండుగలను గోల్కొండ, పబ్లిక్ గార్డెన్లకు మార్చారన్నారు. ప్రస్తుతం గణతంత్ర దినోత్సవాన్ని రాజ్భవన్కు పరిమితం చేయడం శోచనీయమన్నారు. ఇది జాతీయ పండుగను, ప్రజలను అవమానపరచడమేనని, ఇది స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. వ్యక్తిగత, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి జాతీయ పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు.
రూట్మ్యాప్ పరిశీలించిన పోలీసులు
లోకేశ్ పాదయాత్ర రూట్మ్యాప్ను జిల్లా అదనపు ఎస్పీ జగదీశ్ మంగళవారం పరిశీలించారు. స్థానిక కమతమూరు రోడ్డులోని బహిరంగ సభాస్థలిని పలమనేరు డీఎస్పీ సుధాకర్బాబు, సీఐలు శ్రీధర్, మహ్మద్ రియాజ్ అహ్మద్, ఎస్సైలు శివకుమార్, లక్ష్మీరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. బహిరంగ సభ, పాదయాత్ర వివరాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
బాలకృష్ణ కార్యక్రమానికి అనుమతిపై ఉత్కంఠ
హిందూపురం పట్టణం, న్యూస్టుడే: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం చిన్నమార్కెట్ కూడలిలో ఈ నెల 26న తాము ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తలపెట్టగా పోలీసులు అనుమతి ఇవ్వడంలేదని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొననున్నారు. దీనికి అనుమతి కోరుతూ స్థానిక తెదేపా నాయకులు మంగళవారం పోలీసులకు దరఖాస్తు చేశారు. అయితే వారేమీ తేల్చి చెప్పడంలేదు. దీంతో ఉత్కంఠ నెలకొంది. తామేమీ సమావేశాలు నిర్వహించటం లేదని, నిరసన కార్యక్రమమే అని చెబుతున్నా పోలీసులు నోరు మెదపడం లేదని తెదేపా నాయకులు అంటున్నారు. కేసులు పెట్టినా సరే శాంతియుతంగా నిర్వహించి తీరుతామని వారు అన్నారు. అధికార పార్టీ నాయకులు ఎక్కడపడితే అక్కడ కార్యక్రమాలు చేపడితే బందోబస్తు కల్పిస్తున్నారని, తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ముందుగా దరఖాస్తు చేసుకొన్నా అనుమతి ఇవ్వకపోవటం ఏమిటని మండిపడుతున్నారు. ఈ విషయమై సీఐ వెంకటేశ్వర్లును ‘న్యూస్టుడే’ వివరణ కోరగా.. రహదారిపై సభలు, సమావేశాలకు అనుమతి లేదని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.
విద్యార్థి, యువజన సంఘాల నేటి బస్సు యాత్రకు వామపక్షాల మద్దతు
ఈనాడు, అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు సాధనకు విద్యార్థి, యువజన సంఘాలు బుధవారం చేపట్టనున్న బస్సు యాత్రకు సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. విజయవాడలోని దాసరి భవన్లో సమావేశమైన రెండు పార్టీల నాయకులు పలు అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావులతో పాటు నాయకులు జల్లి విల్సన్, అక్కినేని వనజ, ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్, వై.వెంకటేశ్వరరావు, సీహెచ్ బాబూరావులు పాల్గొన్నారు. రోడ్షోలు, ర్యాలీలు, సభలకు అనుమతి నిరాకరిస్తూ అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన ఉత్తర్వు-1పై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 30న విశాఖపట్నంలో జరిగే కార్మిక మహాగర్జనకు మద్దతు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలను సత్వరమే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.
ఉద్యోగుల సంఘాన్ని బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రభుత్వం: సీపీఐ
ఈనాడు, అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ జగన్ ప్రభుత్వం బ్లాక్మెయిల్ చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉద్యోగులు తమ సమస్యలను గవర్నర్కు విన్నవించుకున్నారని వెల్లడించారు. ఉద్యోగుల గోడు రాష్ట్ర ప్రభుత్వం, సీఎం, మంత్రులు పట్టించుకోకపోతే ఎవరికి మొరపెట్టాలి? ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారానికి గవర్నర్కు విజ్ఞప్తి చేయడం నేరమా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణపై ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
తనను పోలీసులు నిత్యం వేధిస్తున్నారని తెదేపా నేత బొండా ఉమా అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
అయిదేళ్ల పాలనలో సర్వం నాశనం
కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ ‘మీ పాలన ఇదీ’ అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.. ఆ ప్యాకెట్ చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని చెప్పారు. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
వసుంధర రాజెను పట్టించుకోని భాజపా
రాజస్థాన్కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసి తిరుగులేని నేతగా ఒక వెలుగు వెలిగిన వసుంధర రాజె ఊసే ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఆమెను భాజపా పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. -
సిట్టింగులు పోయి.. కొత్తోళ్లు
భాజపా 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 303 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆ సిట్టింగ్ సీట్లలో ఈసారి ఇప్పటివరకు 130 చోట్ల వేర్వేరు కారణాల వల్ల అభ్యర్థులను మార్చింది. -
ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. -
సమయానికి ‘108’ రాకే రాజాంలో బాలుడి మృతి
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైకాపా ప్రచారరథం ఢీకొని భరద్వాజ్ అనే బాలుడు మృతిచెందిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
జగన్పై రాయి దాడి కేసులో సెక్షన్ 307 వర్తించదు
సీఎం జగన్పై హత్యాయత్నమే జరగనప్పుడు నిందితుల మీద 307 సెక్షన్ ఎలా బనాయిస్తారని తెదేపా నేతలు ప్రశ్నించారు. చిన్న రాయితో హత్యాయత్నానికి ప్రయత్నించాడని ఓ అమాయకుడిని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా అరెస్టు చేశారని ఆరోపించారు. -
షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసు
రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో ఆమె వివేకా హత్యను ప్రస్తావించి వైకాపాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు అవినాష్రెడ్డి, మల్లాది విష్ణు, వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఎన్నికల సంఘానికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. -
రాయి దాడి హత్యాయత్నం కాదు.. జగన్ నాటకం: వర్ల రామయ్య
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి హత్యాయత్నం కాదని..ఇదంతా ఆయన ఆడుతున్న నాటకమని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లలో అధికారుల నిర్లక్ష్యం
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఇచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల దరఖాస్తుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడం లేదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్పై చర్యలు తీసుకోవాలి
జనసేన అధినేత పవన్కల్యాణ్ను ఉద్దేశించి ఈ నెల 16న భీమవరం సభలో సీఎం జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్కుమార్ మీనాకు ఆ పార్టీ నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. -
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు
-
మహా సంక్లిష్టం!
పశ్చిమ కనుమల్లో కమల వికాసం అంత సులభంగా లేదు. అత్యంత కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో భాజపాకు ఈసారి గెలుపు నల్లేరుపై నడక కాబోవడం లేదు. -
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది.
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్