సైనిక దళాలు సాక్ష్యాలు చూపనవసరం లేదు
మెరుపు దాడులు(సర్జికల్ స్ట్రైక్స్)పై తమ పార్టీకి చెందిన సీనియర్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమైనవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఆక్షేపించారు.
దిగ్విజయ్ వ్యాఖ్యలు హాస్యాస్పదం
వాటితో ఏకీభవించడం లేదు: రాహుల్
ఝాజర్ కొట్లీ, జమ్మూ: మెరుపు దాడులు(సర్జికల్ స్ట్రైక్స్)పై తమ పార్టీకి చెందిన సీనియర్ దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమైనవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం ఆక్షేపించారు. సాయుధ దళాలు తమ విధులను అత్యుత్తమంగా నిర్వహిస్తున్నాయని, ఎటువంటి సాక్ష్యాలు చూపనవసరం లేదని పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడిపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మీడియా నుంచి పెద్ద ఎత్తున ఎదురైన ప్రశ్నలకు రాహుల్ మంగళవారం స్పందించారు. ఆయన వ్యాఖ్యలతో తాను కానీ, పార్టీ కానీ ఏకీభవించడంలేదని స్పష్టీకరించారు. ‘‘కొంతమంది మాటల మధ్యలో తింగరితనంతో మాట్లాడతారు. ఓ సీనియర్ నేత అలా వ్యాఖ్యనించడం సరికాదని చెప్పడానికి చింతిస్తున్నాను. ఆయన అసంబద్ధంగా మాట్లాడారు. మన సైన్యంపై మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఆర్మీ ఏ చర్య చేపట్టినా దానికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాలు ఇవ్వనక్కర్లేదు. దిగ్విజయ్ వ్యాఖ్యలను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పేర్కొన్నదే పార్టీ అధికార విధానం. దిగ్విజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం’’ అని రాహుల్ వివరించారు. దిగ్విజయ్పై ఏదైనా చర్య తీసుకుంటారా? అన్న ప్రశ్నకు కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని, నియంతృత్వంలో లేదని బదులిచ్చారు.
సత్యం బయటకు వచ్చింది
‘‘నా ప్రతిష్ఠను వక్రీకరించేందుకు క్రమపద్ధతిలో భాజపా, ఆర్ఎస్ఎస్ వేల కోట్ల రూపాయలను వెచ్చించాయి. అయితే సత్యం ఎల్లప్పుడూ వెలుగులోకి వస్తుంది’’ అని సోషల్ మీడియాలో ‘పప్పు’ అంటూ తననుద్దేశించి ఎగతాళిగా చిత్రీకరించడంపై రాహుల్ పేర్కొన్నారు. దేశంలో సత్యమే గెలుస్తుందని, డబ్బు కాదని భాజపాకు తెలిసొచ్చేలా కాంగ్రెస్ చేస్తుందన్నారు. భారత్ జోడో యాత్ర చివరి అంకంలో సాగుతోందని తెలిపారు. మంగళవారం తన పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయన జమ్మూలో విలేకరులతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్, భాజపా నేతలు డబ్బు, అధికారంతో ఏమైనా చేయొచ్చని భావిస్తుంటారని విమర్శించారు.
జమ్మూ, కశ్మీర్ ప్రాంతాల మధ్య భాజపా చీలిక తెచ్చిందని రాహుల్ ఆరోపించారు. జమ్మూకశ్మీర్కు ముందుగానే రాష్ట్ర హోదా కల్పించాలని, అలాగే ఇక్కడి శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని తమ పార్టీ కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీపై రాహుల్ స్పందిస్తూ.. ఏ విధమైన నిషేధాలు, అణచివేత, ప్రజలను భయపెట్టడం వంటి చర్యలు సత్యాన్ని బయటకు రాకుండా అడ్డుకోలేవు అని పేర్కొన్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించాను.. సైన్యాన్ని కాదు: దిగ్విజయ్
సొంత పార్టీ సహా వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తన ప్రశ్నలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి తప్ప సైన్యానికి కాదని మంగళవారం ప్రకటించారు. ‘‘మన సాయుధ బలగాలపై నాకు అత్యంత గౌరవం ఉంది. నా ఇద్దరు సోదరీమణులు నౌకాదళ అధికారులను వివాహమాడారు. రక్షణ అధికారులను నిలదీశాననే ప్రశ్నే లేదు. నా ప్రశ్నలన్నీ మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించినవే’’ అని ట్విటర్లో పేర్కొన్నారు. సర్జికల్ స్ట్రైక్స్పై సాక్ష్యాధారాలు చూపాలని, కేంద్రప్రభుత్వం అసత్యాలు చెబుతోందని సోమవారం దిగ్విజయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఇంత సుదీర్ఘ కాలం పట్టిందెందుకు? : భాజపా
సైనిక దళాల పట్ల గౌరవాన్ని బహిరంగంగా ప్రకటించడానికి రాహుల్ గాంధీ ఇంత సుదీర్ఘ కాలాన్ని ఎందుకు తీసుకున్నారని భాజపా ప్రశ్నించింది. సైన్యంపై దిగ్విజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమంటూ తోసిపుచ్చడాన్ని ఆక్షేపించింది. ఉగ్రవాదం, జాతీయ భద్రతపై తమ వైఖరిని స్పష్టం చేయాలంటూ భాజపా సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ను డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
₹1,823 కోట్లకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. శనివారం (మార్చి 30న) దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేపట్టాలని కోరింది. -
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 200 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
కొన్ని సరిచేసుకోవాల్సినవి భారాస చేసుకోలేదు: కె.కేశవరావు
తెలంగాణలో భారాస కష్టకాలంలో ఉంటే.. దేశంలో కాంగ్రెస్ కష్టకాలంలో ఉందని అందుకే ఆ పార్టీలోకి వెళ్తున్నానని రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు తెలిపారు. -
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు.. ఎవరికీ రక్షణ లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో ఆయన ప్రసంగించారు. -
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
చేవెళ్లలో పోటీ చేస్తున్నది కాసాని జ్ఞానేశ్వర్ కాదు కేసీఆర్ అన్నట్టుగా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. -
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. -
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
దిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు కేజ్రీవాల్కు సమయం లేదని, అందుకే తన భార్యను ఆ స్థానంలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. -
కడియం నివాసానికి కాంగ్రెస్ నేతలు.. త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే
వివిధ కారణాలతో ప్రజలు భారాసకు దూరమవుతున్నారని, కాంగ్రెస్లో చేరే అంశంపై త్వరలో నిర్ణయం వెల్లడిస్తానని భారాస నేత, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. -
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని ఎన్నికల బరిలో దింపేందుకు ఎన్డీయే కూటమిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. -
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
పెండింగ్లో ఉన్న 9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను తెదేపా ప్రకటించింది. -
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
తమది విజన్.. జగన్ది పాయిజన్ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ ప్రచారయాత్రలో చంద్రబాబు మాట్లాడారు. -
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
బిహార్లో సీట్ల లెక్క తేలింది. ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోయే స్థానాలు ఖరారయ్యాయి. -
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. -
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
శూన్యం నుంచి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ (KCR) అని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) అన్నారు. -
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదు.. ప్రజలకు సేవచేయడమని ఎన్టీఆర్ నిరూపించారని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు, నేతలకు ఎక్స్(ట్విటర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. -
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
సీఎం రేవంత్రెడ్డితో భారాస ఎంపీ కె.కేశవరావు (కేకే) భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు