పండగ వాతావరణంలో నిర్వహించాలి: చంద్రబాబు
‘పండగ వాతావరణంలో యువగళం నిర్వహించాలి. తెదేపాకు కుప్పం నియోజకవర్గ పరిధిలో 66వేల మంది సభ్యత్వం ఉంది.
కుప్పం పట్టణం, న్యూస్టుడే: ‘పండగ వాతావరణంలో యువగళం నిర్వహించాలి. తెదేపాకు కుప్పం నియోజకవర్గ పరిధిలో 66వేల మంది సభ్యత్వం ఉంది. అన్ని గ్రామాల నుంచి తరలివచ్చి యువగళంలో పాల్గొని విజయవంతం చేయండి. రాష్ట్రంతోపాటు దేశమంతా కుప్పంవైపు చూస్తోంది. తెదేపా కంచుకోట నుంచి ‘యువగళం’ విజయవంతంగా ముందుకు సాగేందుకు సమష్టి కృషి అవసరం. వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారు. జనం భయాన్ని పోగొట్టి స్వచ్ఛందంగా పాదయాత్రకు వచ్చేలా క్షేత్ర స్థాయిలో చైతన్యం తేవాలి’ అని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గ పరిధిలోని 3,900 మంది నాయకులు, కార్యకర్తలతో మంగళవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. యువతరం గొంతును రాష్ట్రమంతా వినిపించేలా చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు సూచించారు. తెదేపా ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ కుప్పంలో ప్రారంభిస్తామని.. ఇదే తరహాలో లోకేశ్ యువగళం పాదయాత్ర ఇక్కడి నుంచే మొదలవుతోందని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K Vishwanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
-
Movies News
K Viswanath: విశ్వనాథ వారి కలం.. అవార్డులు వరించిన ఈ ఐదు చిత్రాలు ఎంతో ప్రత్యేకం..!
-
Politics News
Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు
-
World News
China: అమెరికా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టాలనుకుంటోంది
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Kotamreddy: కాసేపట్లో మళ్లీ మీడియా ముందుకు కోటంరెడ్డి