సంక్షిప్త వార్తలు
రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా గురువారం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో నిర్వహించే పాదయాత్రకు 53 మంది సమన్వయకర్తలను ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బుధవారం నియమించారు.
కాంగ్రెస్ పాదయాత్రకు 53 మంది సమన్వయ కర్తలు
ఈనాడు, అమరావతి: రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మద్దతుగా గురువారం నుంచి రెండు రోజులపాటు రాష్ట్రంలో నిర్వహించే పాదయాత్రకు 53 మంది సమన్వయకర్తలను ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బుధవారం నియమించారు. ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున వీరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
28 పథకాలు రద్దు చేయడమేనా ఎస్సీ, ఎస్టీ సంక్షేమం?
తెదేపా హెచ్ఆర్డీ విభాగం ఛైర్మన్ రామాంజనేయులు
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై జగన్రెడ్డికి నిజంగా ప్రేమే ఉంటే తెదేపా హయాంలో ఆయా వర్గాల అభివృద్ధికి ప్రత్యేకంగా అమలు చేసిన 28 సంక్షేమ పథకాల్ని ఎలా రద్దు చేశారని తెదేపా హెచ్ఆర్డీ విభాగం ఛైర్మన్ బి.రామాంజనేయులు మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సబ్ప్లాన్ అమలుపై వైకాపాలోని ఎస్సీ, ఎస్టీ నేతలు, మంత్రులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు యువత రాష్ట్ర కమిటీలోకి మరో 35 మంది
ఈనాడు డిజిటల్, అమరావతి: తెలుగు యువత రాష్ట్ర కమిటీలో వివిధ జిల్లాల నుంచి అదనంగా 35 మంది సభ్యుల్ని నియమించినట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇద్దరు ఉపాధ్యక్షులు, 12 మంది అధికార ప్రతినిధులు, పది మంది కార్యనిర్వాహక కార్యదర్శులు, పది మంది కార్యదర్శులు, ఒక మీడియా కోఆర్డినేటర్ను నియమించారు.
పోలీసు నియామకాల్లో తప్పిదాలపై గవర్నర్కు యువజన కాంగ్రెస్ ఫిర్యాదు
కోర్టు సూచన మేరకు 7 మార్కులు కలపాలి: శివసేనారెడ్డి
గాంధీభవన్, న్యూస్టుడే: పోలీసు నియామకాల్లో జరిగిన తప్పిదాలపై గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేసినట్లు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. బుధవారం రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలీసు నియామకాల్లో తప్పిదాలకు ఎంతోమంది అర్హులైన విద్యార్థులు నష్టపోయారన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాస్ దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా స్పందించలేదన్నారు. 7 మార్కులు కలపాలని హైకోర్టు సూచించినా కలపడం లేదన్నారు. డ్రైవింగ్ కోసం చేసే నియామకాలకు కూడా రన్నింగ్, లాంగ్ జంప్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణాలతో మనస్తాపానికి గురై ఇప్పటివరకు 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని చెబితే గవర్నర్ చలించిపోయారన్నారు. వీటిపై నివేదికలు తెప్పించుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. హైకోర్టు సూచన మేరకు 7 మార్కులు కలపాలని కోరారు.
బలమైన ఉద్యమంతోనే పంచాయతీ వ్యవస్థ పరిరక్షణ
అఖిలపక్ష సమావేశంలో కోదండరాం
ఖైరతాబాద్, న్యూస్టుడే: బలమైన ఉద్యమంతోనే గ్రామ పంచాయతీ వ్యవస్థను కాపాడుకోగలమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ దిశగా సర్పంచులు పోరాటానికి సిద్ధం కావాలని ఆయన సూచించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణపై రాష్ట్ర సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యాన బుధవారం హైదరాబాద్లోని లక్డీకాపూల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడుతూ సర్పంచులు ఎలా పనిచేయాలి.. తదితర అంశాలకు సంబంధించి అధికారాలను ఎమ్మెల్యేలకు ఇచ్చారని, పగ్గాలు వారి చేతుల్లో పెట్టుకుని సర్పంచులను పరుగెత్తమంటున్నారని విమర్శించారు. సర్పంచుల సంఘం జాతీయ అధ్యక్షుడు ఎలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చట్టం తెచ్చారన్నారు. తెలంగాణ, ఏపీలోనూ 14, 15వ ఆర్థిక సంఘం గ్రామాలకు ఇచ్చిన రూ.8,660 కోట్లు దారి మళ్లించారని, దానిపై ఏపీ భాజపా కేంద్రానికి ఫిర్యాదు చేస్తోందని అన్నారు. తెలంగాణ భాజపా సైతం అదే పని చేయాలని సూచించారు. భాజపా నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ సమస్యను పార్టీలో చర్చించి కేంద్రం దృష్టికి తీసుకెళతామన్నారు. వివిధ సంఘాలు, పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడారు.
ఏప్రిల్లోనే రాజధాని విశాఖకు: మంత్రి బొత్స
ఈనాడు, అమరావతి: ఈ ఏప్రిల్ నెలలోనే రాజధాని విశాఖపట్నానికి తరలివెళ్లిపోయే అవకాశం ఉందని, ఈ సమయంలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ కార్యాలయాన్ని మార్చవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించినట్లు తెలిసింది. ఈ కమిషనరేట్ ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో ఉంది. దీన్ని విజయవాడ బస్స్టాండ్కు సమీపంలోని భవనంలోకి మార్చడానికి ఇటీవల అధికారులు మంత్రికి విన్నవించారు. ఏప్రిల్ నెలలోనే విశాఖకు వెళ్లిపోతామని, ఇప్పుడు కార్యాలయం మార్చడం ఎందుకంటూ ఆయన ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. దీంతో కార్యాలయ మార్పును అధికారులు విరమించుకున్నారు. విశాఖపట్నానికి వెళ్లే కార్యాలయాల్లో విద్యాశాఖే మొదట ఉంటుందని మంత్రి అన్నట్లు తెలిసింది.
లోకేశ్ పరువు నష్టం దావా విచారణకు అర్హమైనదే: విశాఖ కోర్టు
విశాఖ లీగల్, న్యూస్టుడే: తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగేలా వార్తలను ప్రచురించారని జగతి పబ్లికేషన్స్తోపాటు సంబంధిత వ్యక్తులపై తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ దాఖలు చేసిన దావా పూర్తిస్థాయి విచారణకు అర్హమైనదేనని విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానం బుధవారం స్పష్టం చేసింది. తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా జగతి పబ్లికేషన్స్ వార్తలను ప్రచురించడంతో నారా లోకేశ్ రూ.75 కోట్ల నష్టపరిహారం కోరుతూ విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో దావా వేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించే అనుమతులు: ఎస్పీ
ఈనాడు డిజిటల్, చిత్తూరు: సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఇచ్చిన ఆదేశాలను అనుసరించే తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రకు అనుమతులు ఇచ్చామని చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పాదయాత్ర, నిరసనలు, బంద్లు, హర్తాళ్లు నిర్వహించినప్పుడు పాటించాల్సిన నిబంధనలన్నింటినీ భారత పోలీసు చట్టం, సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొన్నాయన్నారు. లోకేశ్ పాదయాత్రకూ వీటినే వర్తింపజేస్తున్నామన్నారు. 2017లో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అమలుచేసిన నిబంధనలే ఇప్పుడూ విధించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ మూడోవిడతకే ఈ ఎన్నికలు
ప్రధాని నరేంద్రమోదీకి మూడో విడత అవకాశం ఇచ్చేందుకు ఈ విడత సార్వత్రిక ఎన్నికలు దోహదపడనున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
ఈవీఎంలపై సందేహాలొద్దు.. పెద్దఎత్తున ఓట్లేయండి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం)పై ఎటువంటి భయాలు, సందేహాలు పెట్టుకోవద్దని, పెద్ద ఎత్తున ఓట్లెయ్యాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ పౌరులకు సూచించారు. -
ప్రజలు ఎన్డీయే అభ్యర్థులకు ఓటేశారు: మోదీ
భాజపా నేతృత్వంలోని ఎన్డీయే అభ్యర్థులకు దేశవ్యాప్తంగా ప్రజలు రికార్డుస్థాయిలో ఓటు వేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగు సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించి ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. -
మహిళలకు జై
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (బిజద) అధినేత నవీన్ పట్నాయక్ సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. -
ఆరు జిల్లాల్లో ఒక్కరూ ఓటెయ్యలేదు
లోక్సభ ఎన్నికల వేళ నాగాలాండ్లో దారుణ పరిస్థితి కనిపించింది. తూర్పు నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఒక్క ఓటరు కూడా పోలింగ్ కేంద్రం వైపు కన్నెత్తి చూడలేదు. -
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది. యాత్రలో ముఖ్యమంత్రిని చూడ్డానికి వచ్చిన విద్యార్థులు జగన్ ఎదుటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్కు జై కొట్టడం చర్చనీయాంశమైంది. -
ఎన్టీఆర్ భవన్లో తెదేపా గీతాల ఆవిష్కరణ
సమాజాన్ని కదిలించే శక్తి గీతాలకు ఉందని తెలంగాణ తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీబీఎన్ వారియర్స్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ నిర్మాతలుగా రూపొందించిన నాలుగు గీతాలను బంజారాహిల్స్లోని ఎన్టీఆర్ భవన్లో శుక్రవారం ఆవిష్కరించారు. -
అభ్యర్థుల ఆస్తులు.. అప్పులు.. కేసులు..
లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిపై కేసు
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డిపై ఆదిభట్ల పోలీస్స్టేషన్లో భూకబ్జా కేసు నమోదైంది. -
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు: జగ్గారెడ్డి
భాజపా నేతలు నకిలీ దేశభక్తులు, గ్రాఫిక్ లీడర్స్ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. -
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
‘ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని తెదేపా అధిష్ఠానం ఆదేశించింది. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పనిచేస్తా. -
అభ్యర్థుల ఆస్తుల వివరాలివీ..
రాష్ట్రంలో లోక్సభ, శాసనసభ నియోజకవర్గాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కాగా, రెండో రోజు శుక్రవారం వివిధ పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. -
జమ్మలమడుగు వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డిపై తిరుగుబాటు
వైయస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే సుధీర్రెడ్డి కోటకు బీటలు వారుతున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇటీవల ముస్లింలు వైకాపా కార్యాలయాన్ని ముట్టడించగా తాజాగా నేడు మైలవరం మండలానికి చెందిన వైకాపా నాయకులు (ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వర్గం) తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. -
తంబళ్లపల్లెలో తెదేపా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ ఎన్డీయే అభ్యర్థి జయచంద్రారెడ్డి(తెదేపా) నామినేషన్ సందర్భంగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. -
వంద మంది వాలంటీర్లు తెదేపాలో చేరిక
భవిష్యత్తులో వైకాపా కనిపించదని.. అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీయేనని మాజీ మంత్రి, నెల్లూరు నగర నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పొంగూరు నారాయణ అన్నారు. -
ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి
‘ఓటేసే ముందు కుటుంబంతో కూర్చుని ఒకటికి పదిసార్లు ఆలోచించండి. ఎవరుంటే మంచి జరుగుతుందో ఆలోచించండి. -
అంతా సౌమ్యులే.. అక్రమాలకు కారకులెవరో?
కాకినాడ నుంచి లోక్సభకు వైకాపా అభ్యర్థిగా పోటీచేస్తున్న చలమలశెట్టి సునీల్తో పాటు అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్థులంతా మంచివారు, సౌమ్యులని.. కొందరు తనకు స్నేహితులని జగన్ కొనియాడారు. -
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
విజయవాడ అజిత్సింగ్నగర్లోని తెదేపా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయం వద్ద శుక్రవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసుల కదలికలు ఉద్రిక్తతకు దారి తీశాయి. -
వైకాపా పాలనలో శిలాఫలకాలే మిగిలాయి
వైకాపా పాలన శిలాఫలకాలకే పరిమితమైందని.. అభివృద్ధి ఆచూకీ లేకుండా పోయిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
వైకాపాను మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని దోచేస్తారు
రాష్ట్రంలో మాదిగలు బాగు పడాలంటే వైయస్ జగన్ను ఓడించి... ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!