Pawan Kalyan: ఇలాంటి సీఎం.. మళ్లీ కావాలా?
‘మా బిడ్డ జైలుకెళ్లారు.. కష్టపడి నడుస్తున్నారు’ అంటూ జగన్ను నమ్మిన జనం ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి ప్రజలనూ ఆయన మోసం చేశారు.
ప్రజలంతా ఆలోచించాలి
నమ్మిన ప్రజలను మోసం చేశారు
కోనసీమలో కులాల మధ్య చిచ్చు పెట్టారు
సొంత మంత్రి ఇంటినీ తగలబెట్టించారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజం
రాష్ట్ర భవిష్యత్తు కోసమే తన వ్యూహాలని వెల్లడి
ఈనాడు, అమరావతి: ‘మా బిడ్డ జైలుకెళ్లారు.. కష్టపడి నడుస్తున్నారు’ అంటూ జగన్ను నమ్మిన జనం ఎంతో మంది ఉన్నారు. కానీ అలాంటి ప్రజలనూ ఆయన మోసం చేశారు. అలాంటి జగన్పై జాలి ఎందుకు? తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా పైరవీలతో రూ.కోట్లు సంపాదించుకున్నారు. తండ్రి శవం పక్కన ఉండగానే సీఎం అవ్వాలనుకున్నారు. ఇదేమైనా రాచరికమా? యువకుడిగా ఉన్నప్పుడు ఒక పోలీసు అధికారిని పులివెందులలో కొట్టారు ఈ ముఖ్యమంత్రి’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇలాంటి సీఎం మనకు మళ్లీ కావాలా అని ప్రజలంతా ఆలోచించాలని.. అయిదుగురు చొప్పునో పది మంది చొప్పునో తర్కంతో చర్చించుకుని నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. ‘రూ.5,000 ఇచ్చి వాలంటీరు ఉద్యోగం ఇస్తే సరిపోతుందా మీకు? మీరు రూ.5వేలకు ఊళ్లలోనే ఉండిపోతారా.. ఐటీ మంత్రికి 6వేల ఎకరాలున్నాయట’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధికి శాంతిభద్రతలు కీలకమని, అందుకే నేరాల్లేని ఆంధ్రప్రదేశ్ను జనసేన కోరుకుంటోందని తెలిపారు. ఒకసారి కమ్యూనిస్టులతో ఉంటావు.. మరోసారి భాజపాతో ఉంటావని తనను ప్రశ్నిస్తుంటారని.. తాను మధ్యలోనే ఉంటానని, ప్రజల కోసమే ఎజెండాలు మారుస్తుంటానని జనసేన అధినేత స్పష్టం చేశారు. తన వ్యూహాలు తనకోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని చెప్పారు. జనసేనకు ఇప్పటికిప్పుడు అధికారం ఇస్తే సరేకానీ, ఆ పరిస్థితి లేకపోతే అది వచ్చేవరకూ సామరస్యంగా నిరీక్షించాల్సిందేనని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు.
విడగొడతాం అంటే తోలు తీస్తాం
‘ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలని, రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలని అంటున్నారని, వైకాపాకు అధికారం రాకపోతే మీకు ప్రత్యేక రాష్ట్రాలు ఇచ్చేయాలా అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావును పవన్ నిలదీశారు. ‘రాయలసీమలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి అలాగే అన్నారు. ఎవరైనా సరే వేర్పాటువాద ధోరణితో మాట్లాడితే నా అంత తీవ్రంగా స్పందించేవారు మరొకరు ఉండరు. మరోసారి రాష్ట్రాన్ని విడగొడతాం అంటే తోలు తీసి కూర్చోబెడతాం. మాట్లాడితే రాయలసీమ, రాయలసీమ అంటారు. రాయలసీమకు మీరు ఏం చేశారు? ఎందుకు దాన్ని కాపాడుకోలేకపోయారు? సీమ నుంచి ఎందరో వలసలు వెళ్లిపోతున్నారు’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఈ సీఎంలా కులాల మధ్య గొడవలు పెట్టను
‘తెలంగాణ లాంటి తిరుగుబాటు ధోరణి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో బాగుపడేది. అన్యాయం జరిగితే వాళ్లు రోడ్లపైకి వస్తారు. ఏపీ ప్రజలకు కులం మీద ఉన్న పిచ్చి ఆంధ్ర జాతి మీద లేదన్నది వాస్తవం. ఈ సీఎంలా నేను కులపిచ్చి ఉన్నవాణ్ణి కాదు. కులాల తాలూకు అసమానతలు అర్థం చేసుకున్న భారతీయుణ్ని. ఈ సీఎం కోనసీమలో 3, 4 కులాల మధ్య ఘర్షణలు పెట్టేశారు. సొంత మంత్రి ఇల్లు తగలబెట్టించేశారు. అందుకే ఆయన ఇప్పటి వరకూ మంత్రి విశ్వరూప్ను పరామర్శించేందుకు వెళ్లలేదు. ఈ ఆధిపత్య ధోరణి ఉన్నంతవరకు రాష్ట్రం బాగుపడదు. యువత ఇక్కడి కుల యుద్ధాలను అర్థం చేసుకుని సరిగా వ్యవహరించకపోతే అభివృద్ధి తమిళనాడుకో, గుజరాత్కో, యూపీకో, బిహార్కో తరలిపోతుంది’ అని పేర్కొన్నారు.
సీఎం అయిపోవాలని కలలు కనడం లేదు..
‘పార్టీ నిర్మాణం అంత సులభం కాదు. లక్ష మందిని ఒక చోటకు తీసుకొచ్చి పాలసీ చెప్పి ఒప్పించగలరా? నా తాత, నాయన ఎవరూ ముఖ్యమంత్రులు కాదు, మా బాబాయిలు ఎంపీలు కాదు. ఎంతో కష్టపడుతున్నాం. పార్టీ నిర్మాణం అంటే దశాబ్దం నిరీక్షించాలి. ఆ తర్వాత ఎటువైపు వెళుతుందో చూద్దాం. నేను ముఖ్యమంత్రిని అయిపోవాలని కలలు కనడం లేదు. ప్రజలు అంగీకరించి ఓట్లేస్తేనే సీఎం అవుతా. మనం తొలుత రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్కు బలమైన రాజకీయ స్థిరత్వం ఉంటేనే అభివృద్ధి వస్తుంది. అది జనసేనవల్ల సాధ్యమవుతుందని ప్రజలు అనుకుని అధికారం ఇచ్చే వరకు సామరస్యంగా నిరీక్షిద్దాం’ అని జన సైనికులకు ఉద్బోధించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదని పవన్ వ్యాఖ్యానించారు. సెక్యులరిజం, హేతువాదం పేరుతో హిందూ దేవుళ్లను విమర్శించి, ప్రజల మనోభావాన్ని దెబ్బతీయడం తగదని, ఏ మతం వారిని అవమానించినా తానే ముందు స్పందిస్తానని చెప్పారు.
ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసమే: మనోహర్
జనసేన కేవలం ఓట్ల కోసమే రాజకీయం చేయదని.. ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసమే వేస్తుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాబోయే ఏడాది కాలం ఎంతో ముఖ్యమని తెలిపారు. ఇప్పటికే ఉన్న 3.60 లక్షల మంది సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడంతో పాటు కొత్తవారిని సభ్యులుగా చేర్చుకునే కార్యక్రమం చేపడదామని, ప్రతి నియోజకవర్గంలో పార్టీ తరపున న్యాయవాదులను నియమించబోతున్నామని వివరించారు.
జనసేనలోకి విశాఖ కార్పొరేటర్
జీవీఎంసీ 32వ వార్డు ఇండిపెండెంట్ (వైకాపా మద్దతుదారు) కార్పొరేటర్ కందుల నాగరాజు తన అనుచరులతో కలిసి గురువారం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది. -
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైకాపా అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమేనని సీఎం జగన్ ఇటీవల సిద్ధం సభలో చేసిన వ్యాఖ్యలు.. ఆమె అఫిడవిట్లో పేర్కొన్న వివరాలతో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. -
వేమిరెడ్డి దంపతుల ఆస్తులు.. రూ.715.62 కోట్లు
నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆమె భర్త ప్రభాకర్రెడ్డి ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. -
అబ్బో.. కేసుల్లోనూ ఘనులే
చిత్తూరు వైకాపా అసెంబ్లీ అభ్యర్థి విజయానందరెడ్డిపై ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి 12 కేసులున్నాయి. -
లోకేశ్ తరఫున నామినేషన్ దాఖలు
గుంటూరు జిల్లా మంగళగిరి కూటమి అభ్యర్థి, తెదేపా యువనేత నారా లోకేశ్ తరఫున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను గురువారం రిటర్నింగ్ అధికారి రాజకుమారికి అందజేశారు. -
రైతులను అప్పుల్లో ముంచిన జగన్
సీఎం జగన్ పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటే.. వాటిని కప్పిపుచ్చి ప్రోగ్రెస్ కార్డుల పేరుతో రాష్ట్ర ప్రజలను మరోసారి వంచించడానికి వైకాపా నేతలు ప్రయత్నించడం సిగ్గుచేటని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. -
సీఎం జగన్ అవినీతిపై ఛార్జిషీట్ విడుదల చేస్తాం
ముఖ్యమంత్రి జగన్ అవినీతిపై ఛార్జ్షీట్ రూపొందిస్తామని భాజపా రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?