కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు పోతేనే.. యువతకు కొలువులు
కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే గ్రామీణుల బతుకులు మారుతాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. గురువారం ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రను వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం మదన్పల్లిలో ప్రారంభించారు.
‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్
బొంరాస్పేట, న్యూస్టుడే: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే గ్రామీణుల బతుకులు మారుతాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. గురువారం ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రను వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలం మదన్పల్లిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్లు కులమతాల మధ్య చిచ్చుపెడుతూ.. రాజకీయంగా లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ నివాసాలు, ఉచిత విద్య, ఫీజు రీయంబర్స్మెంట్ తదితర సంక్షేమ పథకాలతో పాటు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమైనట్లు రేవంత్ గుర్తు చేశారు. భారాస రెండు పడక గదుల ఇళ్లు, రూ.లక్ష రుణమాఫీ, ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక విస్మరించిందన్నారు. మైనార్టీలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపులేదని.. రైతులకు గిట్టుబాటు ధరలు, రాయితీ పథకాలు ఇవ్వడంలేదని దుయ్యబట్టారు. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడితేనే రాష్ట్రంలోని యువతకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఆగిపోవని రేవంత్ భరోసా ఇచ్చారు. బొంరాస్పేటలో పొలాల్లోకి వెళ్లి మహిళా కూలీలతో మాట్లాడారు. అనంతరం కొడంగల్కు వెళ్లారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?