రేవంత్ వ్యాఖ్యలు సరికాదు: కూనంనేని
కమ్యూనిస్టులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వాటిని ఆయన వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.
హిమాయత్నగర్ న్యూస్టుడే: కమ్యూనిస్టులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వాటిని ఆయన వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్లో పార్టీ నాయకులు చాడ వెంకట్రెడ్డి, పశ్య పద్మలతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం చేసే పొరపాట్లకు వామపక్షాలు బాధ్యత వహించాలని రేవంత్రెడ్డి అనడం సరికాదన్నారు. ‘‘పేదలకు ఇళ్లస్థలాలు, గిరిజనులకు పోడు భూములు తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడుతున్న తమను రేవంత్ ఎందుకు గుర్తించడం లేదు? అంశాల వారీగానే భారాసకు మద్దతు ఇస్తున్నాం. గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమాన్ని బహిష్కరించాం. గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని తమ పార్టీ ఎప్పటి నుంచో పోరాడుతోంది’’ అని అన్నారు. అంతకుముందు మఖ్ధూంభవన్ ఆవరణలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కూనంనేని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!