గవర్నర్ తన హోదాను మరిచిపోయి మాట్లాడటం బాధాకరం: తలసాని
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న గవర్నర్ గణతంత్ర దినోత్సవం రోజు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని, ఆమెపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
రెజిమెంటల్బజార్, న్యూస్టుడే: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న గవర్నర్ గణతంత్ర దినోత్సవం రోజు ప్రభుత్వంపై విమర్శలు చేయడం తగదని, ఆమెపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం ఆయన సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డులోని దక్కన్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి అంటే బంగ్లాలు కాదని గవర్నర్ అంటున్నారని మరి పార్లమెంటు ఉండగా మరో భవనం, ప్రధాని బంగ్లాలను కడుతున్నారని.. దాన్నేమంటారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు, డీజీపీ, సీఎస్ను పక్కన పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఆమె హోదాను మరిచిపోయి మాట్లాడటం బాధాకరమన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇలా విమర్శించడం.. గవర్నర్ హోదాను దిగజార్చే విధంగా మాట్లాడటం తగదని హితవు పలికారు. గవర్నర్ ప్రభుత్వంతో ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో ఉండాలని, ఒక పార్టీ కింద పనిచేసే వారిగా ఉంటే తాము ఊరుకోబోమని చెప్పారు. .
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!