రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి అవసరం
రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.
తెదేపా అధినేత చంద్రబాబు
ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేస్తున్న చంద్రబాబు
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణకు స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘విజన్- 2047’తో ప్రణాళికాబద్ధంగా సాగితే భవిష్యత్తులో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానానికి చేరుతుందని తెలిపారు. నైపుణ్యం గల పౌరులు, డిజిటల్ సామర్థ్యం, ప్రపంచంలో ఎవరికీ లేని యువశక్తి భారతదేశానికి ఉన్న బలమని చెప్పారు. ‘ఐటీ విప్లవాన్ని అవకాశంగా మార్చుకుని తెలుగువారు ప్రపంచ స్థాయిలో ఉత్తమ విజయాలు సాధించారు. 2029కి ఏపీని దేశంలో నంబర్వన్ గా మార్చేందుకు తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రణాళికాబద్ధంగా పని చేశాం. నేడు వైకాపా ప్రభుత్వం తన విధ్వంస విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. రాజ్యాంగ విరుద్ధ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలనతో రాష్ట్ర భవిష్యత్తు ప్రమాదంలో పడింది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
తెదేపా కేంద్ర కార్యాలయంలో...
ఈనాడు డిజిటల్, అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాడు బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమికొట్టిన ఘట్టాల్ని రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకోవాలని, రాష్ట్రాన్ని ఏలుతున్న నియంతల్ని అదే స్ఫూర్తితో పరుగులు పెట్టించాల్సిన బాధ్యత ఏపీ యువతపై ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అశోక్బాబు, పార్టీ కార్యానిర్వాహక కార్యదర్శి బుచ్చిరామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM