Yuvagalam: నాడు అధినేత.. నేడు యువ నేత
తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం.. పార్టీపరంగా కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వేదికగా నిలుస్తోంది.
కుప్పం, న్యూస్టుడే: తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం.. పార్టీపరంగా కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు వేదికగా నిలుస్తోంది. గతంలో పార్టీ పరంగానూ.. తెదేపా పాలనలోనూ రాష్ట్ర స్థాయిలో అమలు చేసిన అనేక కార్యక్రమాలకు చంద్రబాబు కుప్పంలోనే శ్రీకారం చుట్టారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు కుప్పంలో ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటంలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ‘వస్తున్నా మీకోసం’ పేరిట పాదయాత్ర చేపట్టిన ఆయన కుప్పంలో ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. కుప్పంలో ర్యాలీ ప్రారంభించి 45 కిలోమీటర్ల మేర బుల్లెట్ నడిపి పార్టీశ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. తెదేపా పటిష్ఠతతోపాటు చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గాన్ని ప్రయోగాలకు నిలయంగా మార్చారు. ‘శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, నీరు- మీరు, నీరు- చెట్టు’ తదితర కార్యక్రమాలను కుప్పంలోనే ప్రారంభించారు. బిందు సేద్యం పథకాన్ని 1999లో ముఖ్యమంత్రిగా ఆయన తొలుత కుప్పంలోనే అమలుచేసి.. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించారు.
లక్ష్మీపురం ఆలయం సెంటిమెంటు
కుప్పం సమీపంలోని లక్ష్మీపురంలో కొలువైన ప్రసన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో తెదేపా కార్యక్రమాలను ప్రారంభించడాన్ని సెంటిమెంటుగా కొనసాగిస్తున్నారు. గతంలో అనేక దఫాలు చంద్రబాబు కుప్పం పర్యటనలు, నామినేషన్లు, ర్యాలీలకు సంబంధించి వరదరాజస్వామి సన్నిధిలో పూజల తర్వాతే కార్యక్రమాలను ప్రారంభించడాన్ని ఆనవాయితీగా చేపట్టారు. గతంలో పలుమార్లు కుప్పంలో పర్యటించిన లోకేశ్.. ఎన్నికల ప్రచారాలు, గ్రామ పర్యటనలనూ లక్ష్మీపురంలో పూజలతోనే ప్రారంభించారు. శుక్రవారం యువగళం పాదయాత్రనూ వరదరాజస్వామి సన్నిధిలో పూజాదికాల అనంతరం.. లక్ష్మీపురం నుంచి ప్రారంభిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు