పోలీసుల ప్రేక్షక పాత్రపై అసంతృప్తి
రాజకీయ పార్టీలు, ముఖ్య నాయకులు ఏవైనా సభలు, సమావేశాలు నిర్వహించినా... పాదయాత్రలు, ర్యాలీలు చేపట్టినా బందోబస్తు మొదలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణతోపాటు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే.
ఈనాడు డిజిటల్, చిత్తూరు: రాజకీయ పార్టీలు, ముఖ్య నాయకులు ఏవైనా సభలు, సమావేశాలు నిర్వహించినా... పాదయాత్రలు, ర్యాలీలు చేపట్టినా బందోబస్తు మొదలు ట్రాఫిక్ క్రమబద్ధీకరణతోపాటు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా తొలిరోజు శుక్రవారం కుప్పం పట్టణంలో భిన్నమైన పరిస్థితి కనిపించింది. పాదయాత్రకు అనుమతిచ్చినప్పుడే అవసరమైన పురుష, మహిళా వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలని పలమనేరు డీఎస్పీ సుధాకర్రెడ్డి ఉత్తర్వుల్లో సూచించారు. తమ సిబ్బందీ సహకరిస్తారని అందులో తెలిపారు. ఇందుకు తగ్గట్లుగానే 500 మంది పోలీసులను పాదయాత్ర విధులకు కేటాయించినప్పటికీ కొందరు ఈ బాధ్యతలు తమవి కావన్నట్లు వ్యవహరించారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. తొలిరోజు కీలక నేతల భద్రతతోపాటు బందోబస్తును కూడా తెదేపా వాలంటీర్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బందే చూసుకున్నారని తెలిపారు. సినీ కథానాయకులు బాలకృష్ణ, తారకరత్న, యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ల వెంట వాలంటీర్లు మాత్రమే కనిపించారు. అభిమానులు, కార్యకర్తలు దూసుకొస్తుంటే వారే నిలువరించారు. పోలీసులు మాత్రం రోడ్డు పక్కనే ఉండిపోయారు. తారకరత్న ఆసుపత్రిలో చేరడానికి ఇదీ ఒక కారణమని తెదేపా వర్గాలు మండిపడుతున్నాయి. ఒకానొక సందర్భంలో అభిమానుల తాకిడి పెరగడంతో బాలకృష్ణ, శ్రీరామ్లను తెదేపా ప్రచారం రథంలోకి పంపించారు. కుప్పంలోని వంతెన నుంచి ప్రాంతీయ ఆసుపత్రి వరకు ట్రాఫిక్ నిలిచిపోగా తెదేపా కార్యకర్తలు, యువకులే క్రమబద్ధీకరించారు. వైకాపా నాయకుల ఫ్లెక్సీల వద్ద మాత్రం పోలీసు సిబ్బందిని మోహరించారు. గురువారం రాత్రే తెదేపా నేతలు ఏర్పాటు చేసుకున్న కొన్ని ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. ఇది ఉద్రిక్తతలకు దారి తీస్తుందని భావించినప్పటికీ తెలుగుదేశం కార్యకర్తలు సంయమనం పాటించారు. ఫలితంగానే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న